Ind vs Wi 2nd Test : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్ తర్వాత, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శించింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదాన్ని తప్పించింది. భారత్‌కు 121 పరుగులు లక్ష్యంగా నిర్దేశించింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగులు చేసింది. వెస్టిండీస్ చివరి వికెట్‌కు 79 పరుగులు జోడించింది.

Continues below advertisement


మొదటి ఇన్నింగ్స్‌లో ఫాలోఆన్, 270 పరుగులు వెనుకబడిన తర్వాత, వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. వెస్టిండీస్ జట్టు ఒక ఇన్నింగ్స్‌తో ఓడిపోతుందని అందరూ భావించారు, కాని జాన్ క్యాంప్‌బెల్ 115 పరుగులు, కెప్టెన్ షై హోప్ 103 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదాన్ని తప్పించారు. ఆ తర్వాత జస్టిన్ గ్రీవ్స్ అర్ధ సెంచరీ సాధించాడు. అతను జెడెన్ సీల్స్‌తో కలిసి 10వ వికెట్‌కు 79 పరుగులు జోడించాడు. ఇప్పుడు రెండో టెస్టు గెలవడానికి భారత్ 121 పరుగులు చేయాలి.


ఒత్తిడిలో అదరగొట్టిన  విండీస్


518 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్‌ను 248 పరుగులకు ఆలౌట్ చేశారు భారత్ బౌలర్లు. ఆపై ఫాలో-ఆన్ విధించడంతో తిరిగి బ్యాటింగ్‌కు విండీస్‌ను ఆహ్వానించారు. అప్పుడు కూడా విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసి ఈ మ్యాచ్‌ను కూడా త్వరగా పూర్తి చేద్దామని ప్లాన్ చేశారు. కానీ విండీస్‌ ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వలేదు.  


అయితే, రెండో ఇన్నింగ్స్‌లో విండీస్‌ మొదట్లో తడబడినప్పటికీ తర్వాత బ్యాట్స్‌మెన్ చాలా గట్టిగా నిలబడ్డారు. జాన్ కాంప్‌బెల్, షాయ్ హోప్ ఇద్దరూ 100+ పరుగులు చేసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోర్‌ను భారత్ చేసిన స్కోరుకు సమానంగా చేసి అవుట్ అయ్యారు. 


తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 10 పరుగులకే ఔటైన జాన్ కాంప్‌బెల్ రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా భిన్నమైన శైలితో బ్యాటింగ్ చేశాడు. అతను భారత బౌలర్లను గట్టిగా ఎదుర్కొని 175 బంతుల్లో తన సెంచరీని చేశాడు. అందులో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.


అతని ఇన్నింగ్స్ ఫాలో ఆన్‌లో ఉన్న వెస్టిండీస్‌కు భారత్ ఆధిక్యాన్ని తగ్గించడంలో సహాయపడింది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 248 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో కాంప్‌బెల్ సెంచరీ జట్టును తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చింది.


షాయ్ హోప్ బలమైన భాగస్వామి అయ్యాడు


ఈ కీలకమైన ఇన్నింగ్స్‌లో కాంప్‌బెల్‌కు వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ చక్కటి మద్దతు ఇచ్చాడు. ఇద్దరూ మంచి భాగస్వామ్యాన్ని పంచుకున్నారు, ఇది భారత జట్టు వేగాన్ని దెబ్బతీసింది.


షాయ్ హోప్ కూడా అద్భుతమైన ప్రశాంతతను ప్రదర్శించి తన సెంచరీని సాధించాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లు వికెట్ల కోసం ఇబ్బంది పడేలా చేశారు. వారి భాగస్వామ్యం వెస్టిండీస్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది  


ఇద్దరూ కాంప్‌బెల్ 115, హోప్ 103 సెంచరీలు చేశారు. కానీ 4వ రోజు వారు అవుటైన తర్వాత, శుభ్‌మాన్ గిల్ జట్టు ఆధిక్యాన్ని పొందడానికి ఎక్కువ సమయం పట్టలేదు.


ఇన్నింగ్స్ 84వ ఓవర్ తర్వాత వెస్టిండీస్ త్వరగా వికెట్లు కోల్పోయింది, కానీ జస్టిన్ గ్రీవ్స్ , జేడెన్ సీల్స్ చివరి వికెట్ భాగస్వామ్యం కారణంగా 100+ పరుగుల ఆధిక్యాన్ని సాధించగలిగింది.


భారత స్పిన్నర్లు బంతితో


ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు మెరిశారు. కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు, ఆపై ఫాలో-ఆన్ తర్వాత మరో మూడు వికెట్లు పడగొట్టాడు.


ఫాలో-ఆన్ తర్వాత రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్లు తీసిన వారిలో ఉన్నారు.


ఫాస్ట్ బౌలర్లు, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టారు.