IND VS SL 1st Test, Indian Bowlers Push For Victory:  గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో టీమ్ ఇండియా తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్ర‌త్య‌ర్థి ముందు భారీ టార్గెట్ నిర్దేశించగా, మంగళవారం నాలుగోరోజు ఆటముగిసేసరికి 34 ఓవర్లలో లంక 4 వికెట్లకు 84 పరుగుల మాత్రమే చేసింది. విజయానికి ఇంకా 288 పరుగులు కావాలి. మానవ్ సుతార్ రెండు వికెట్లతో రాణించాడు.  బుధ‌వారం మ‌రో ఆరు వికెట్లు తీసే టీమిండియా గెలుపు సొంత‌మ‌వుతుంది. అంత‌కుముందు త‌మ‌ రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 193 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వికెట్ కీపర్ బ్యాట‌ర్ రిష‌భ్ పంత్ (66) టాప్ స్కోర‌ర్. బౌల‌ర్ల‌లో అసిత ఫెర్నాండో కు నాలుగు, జ‌య‌సూర్య‌కు మూడు, లహిరు కుమార‌కు రెండు వికెట్లు ద‌క్కాయి. శ్రీలంక ముందు 372 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. గాలే అంతర్జాతీయ స్టేడియం చరిత్రలో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ 2022 లో పాకిస్తాన్ సాధించిన 344 పరుగులు మాత్రమే. అలాంటి గాలే పిచ్ పై 372 రన్స్ ఛేజ్ చేయడం లంకకు దాదాపు అసాధ్యమైన టాస్క్ గా మారింది.

Continues below advertisement

Continues below advertisement

పంత్ మెరుపు హాఫ్ సెంచరీ.. పడిక్కల్ సూపర్ బ్యాటింగ్అంత‌కుముందు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భార‌త్  త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్లను కోల్పోయింది. య‌శ‌స్వి జైస్వాల్ డ‌కౌట్ కాగా, శుభ‌మాన్ గిల్ (8), ర‌వీంద్ర జ‌డేజా (9) విఫ‌ల‌మ‌య్యారు. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ తో పాటు తొలి ఇన్నింగ్స్ సెంచ‌రీ హీరో దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ (44) ఆక‌ట్టుకున్నారు. శ్రీలంక బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ భారత బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే  పంత్ కేవలం కొన్ని ఓవర్లలోనే 66 రన్స్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టీ బ్రేక్ సమయానికి ఇండియా 193 పరుగులు జోడించి పర్యాటక జట్టుకు భారీ టార్గెట్ ను నిర్దేశించింది.

మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్.. లంక నాలుగు వికెట్లు డౌన్భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను భారత బౌలర్లు ఆరంభం నుంచే కట్టడి చేశారు. పేసర్ మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, ప్రసిద్ధ్ కృష్ణ కూడా వికెట్ తీశాడు. ఆ తర్వాత స్పిన్నర్ మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో రెండు కీలక వికెట్లు పడగొట్టి లంక టాప్ ఆర్డర్ ను కూల్చేశాడు. రవీంద్ర జడేజా మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంక బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ ధ‌నంజ‌య డిసిల్వా (31 బ్యాటింగ్) టాప్ స్కోర‌ర్ కాగా, అత‌నితోపాటు సోనాల్ దినుష (25 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 

వెలుతురు లేమితో ఆట నిలిపివేత.. చివరి రోజు విజయంపై భారత్ కన్నుసాయంత్రం 6 త‌ర్వాత‌ మైదానంలో వెలుతురు మందగించడంతో అంపైర్లు లైట్ మీటర్ ద్వారా పరీక్షించి నాలుగో రోజు ఆటను ముగించారు. ఆఖరి రోజు కూడా వర్ష సూచన ఉన్నప్పటికీ, మిగిలిన ఆరు వికెట్లను త్వరగా పడగొట్టి తొలి టెస్టును సొంతం చేసుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన పూర్తి పట్టుదలతో ఉంది.