ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం కలిసి రావడంతో ఈసారి కూడా దాన్ని రిపీట్ చేసింది. టీమిండియాలో శ్రేయస్ అయ్యర్ స్థానంలో విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ తుదిజట్టులో ఎలాంటి మార్పూ చేయలేదు. మొదటి వన్డేలో విజయం సాధించిన టీమిండియా ఈ మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ 2-0తో సొంతం అవుతుంది.


ఇంగ్లండ్ తుదిజట్టు
జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మొయిన్ అలీ, లియాం లివింగ్‌స్టోన్, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్, రీస్ టాప్లే


టీమిండియా తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, ప్రసీద్ కృష్ణ