ED Action Against Suresh Raina And Shikhar Dhawan: భారత మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు కష్టాలు పెరిగాయి. గురువారం నాడు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో ఇద్దరిపై చర్యలు తీసుకుంటూ వారి రూ.11.14 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. సురేష్ రైనా, శిఖర్ ధావన్‌ విదేశీ కంపెనీలతో కలిసి అక్రమ బెట్టింగ్ కంపెనీ 1xBetని ప్రోత్సహించారని ఈడీ తన విచారణలో గుర్తించింది.

Continues below advertisement

సమాచారం ప్రకారం, సురేష్ రైనా రూ.6.64 కోట్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి, శిఖర్ ధావన్ రూ.4.5 కోట్ల స్థిర ఆస్తులను జప్తు చేశారు. ఈ విచారణలో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పను కూడా ప్రశ్నించారు. నటులు సోనూ సూద్, ఊర్వశి రౌతేలాను కూడా విచారణకు పిలిచారు. అనేక రాష్ట్రాల పోలీసులు 1xBet,  దాని అనుబంధ బ్రాండ్‌లపై అక్రమ లావాదేవీలు, ఆన్‌లైన్ జూదానికి ప్రోత్సాహం, మోసం వంటి ఆరోపణలు చేసినప్పుడు ఈ కేసు తీవ్ర రూపం దాల్చింది.

ఈ ఎఫ్‌ఐఆర్‌ల కారణంగా పోలీసులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రారంభ విచారణలో ఈడీకి అనుమానాస్పద డబ్బు లావాదేవీలు, విదేశీ ఖాతాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. 1xBet యాప్ భారతదేశంలో చట్టబద్ధం కాదని తెలిసినా క్రికెటర్లు ఈ యాప్‌ను ప్రోత్సహించారని ఈడీ అధికారులు చెబుతున్నారు.

Continues below advertisement

భారతీయ వినియోగదారులు డిపాజిట్ చేసిన మొత్తాన్ని సేకరించడానికి 6,000 ఖాతాలను ఉపయోగించారని తెలిసింది. ఆ తర్వాత డబ్బును చట్టబద్ధం చేయడానికి అనేక దశల్లో లావాదేవీలు జరిగాయి. డబ్బు లావాదేవీల సరళిని పరిశీలిస్తే వెయ్యి కోట్లకుపైగా మనీ లాండరింగ్ జరిగినట్లు సూచనలు ఉన్నాయని ఈడీ తెలిపింది.

ఈడీ నాలుగు గేట్‌వేలపై దాడులు చేసి 60కిపైగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది, అలాగే రూ.4 కోట్లకుపైగా డబ్బును స్తంభింపజేసింది. విచారణలో అక్రమ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు కూడా లభించాయి. ఈ విషయంలో ఆన్‌లైన్ బెట్టింగ్, అక్రమ లింక్‌ల వంటి పథకాలకు దూరంగా ఉండాలని ఈడీ ప్రజలకు కూడా సూచించింది.