BCCI Backs Gautam Gambhir: ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఫ్యూచర్ పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బిగ్ డిస్కషన్ నడుస్తోంది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ వైట్ బాల్ టూర్లలో ఓటములు, అంతకుముందు హోమ్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాల చేతిలో ఎదురైన ఘోరమైన టెస్ట్ సిరీస్ దెబ్బలతో గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తీసేయాలనే డిమాండ్లు వినిపించాయి. డబ్ల్యూటీసీ (WTC) 2027 ఫైనల్ రేసులో ఇండియా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ, గంభీర్ పొజిషన్ కు ఎలాంటి ప్రమాదం లేదని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి.

Continues below advertisement

Continues below advertisement

టీమ్ ట్రాన్సిషన్ ఫేజ్.. సెలెక్టర్ల మైండ్ సెట్తాజా రిపోర్ట్ ప్రకారం గంభీర్‌ను పదవి నుంచి తప్పించకపోవడానికి రెండు ప్రైమరీ రీజన్స్ ఉన్నాయి. రెడ్ బాల్ క్రికెట్‌లో టీమ్ ప్రస్తుతం బిగ్ ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉందనే విషయాన్ని బిసిసిఐ యాజమాన్యం యాక్సెప్ట్ చేస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి లెజెండరీ ప్లేయర్లు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేయడంతో కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆధ్వర్యంలో యంగ్ టీమ్ రూపుదిద్దుకుంటోంది. ఈ టైమ్ లో కోచ్‌ను మార్చడం కరెక్ట్ కాదని బోర్డు భావిస్తోంది.

కీ ప్లేయర్ల గాయాలు.. బిసిసిఐ కన్సిడరేషన్రెండో రీజన్ కీ ప్లేయర్ల ఇంజ్యూరీ ప్రాబ్లమ్స్. సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ మధ్యలో గిల్ గాయపడకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని బిసిసిఐ భావిస్తోంది. శ్రీలంకతో జరగబోయే టూ-టెస్ట్ టూర్ లోనూ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ వంటి కీ ప్లేయర్లు గాయాలతో దూరం కావడం కోచ్ తప్పిదం కాదని స్పష్టం చేసింది. సీఓఈ (CoE) హెడ్‌గా వివిఎస్ లక్ష్మణ్ తన రోల్ లో కంఫర్టబుల్ గా ఉన్నాడని, తాత్కాలిక కోచ్ ని నియమించే ఆలోచన లేదని బిసిసిఐ వర్గాలు తెలిపాయి.

2027 వన్డే వరల్డ్ కప్ వరకు గంభీర్ కంటిన్యూడబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో శ్రీలంక సిరీస్ తర్వాత ఇండియాకి కేవలం రెండు టెస్ట్ సిరీస్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వైట్ బాల్ క్రికెట్ విషయానికొస్తే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు గంభీర్ కోచ్‌గా కంటిన్యూ అవుతాడని బోర్డు ఆఫీషియల్స్ వెల్లడించారు. ఎన్ని విమర్శలు వచ్చినా బిసిసిఐ నుంచి గంభీర్‌కి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది.