Ashwin Criticizes Gambhir Strategy For World Cup:  వన్డే వరల్డ్ కప్ 2027 కి ఇండియా ప్రిపరేషన్స్ సీరియస్ గా స్టార్ట్ అయిన వేళ ఇంగ్లాండ్‌తో జరిగిన వ‌న్డే సిరీస్ ఓటమి తీవ్రంగా కలవరపెడుతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజాలు టీమ్ లోకి తిరిగొచ్చినప్పటికీ ఇండియా కంప్లీట్ పర్ఫెక్ట్ యూనిట్ లా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ప్రెజెంట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ విధానంతో కంపేర్ చేస్తూ హాట్ కామెంట్స్ చేశాడు. అరకొరగా ఆడే 'బిట్స్ అండ్ పీసెస్' ఆల్‌రౌండర్లపై టీమ్ ఎక్కువగా డిపెండ్ అవ్వడమే బిగ్గెస్ట్ ప్రాబ్లెమ్ అని అశ్విన్ విశ్లేషించాడు.

Continues below advertisement

Read Also: Shreyas Iyer World Record: కెప్టెన్ గా శ్రేయస్ వరల్డ్ రికార్డ్ .. జింబాబ్వేపై విక్టరీతో 7 మ్యాచుల నిరీక్షణకు ఎండ్ కార్డ్, ధోని రికార్డు బ్రేక్

హార్దిక్ ఆల్టర్నేటివ్ ప్రొబ్లెమ్.. ద్రవిడ్ వర్సెస్ గంభీర్ స్ట్రాటజీహార్దిక్ పాండ్యాకు ప్రాపర్ ఆల్టర్నేటివ్ లేకపోవడం టీమ్ కు పెద్ద తలనొప్పిగా మారింది. నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబేలను ఆప్షన్లుగా చూస్తున్నప్పటికీ, నితీష్ కి కూడా రీసెంట్ గా గాయాలయ్యాయి. ఈ సిచువేషన్ పై అశ్విన్ మాట్లాడుతూ.. "2023 వరల్డ్ కప్ లో హార్దిక్ లేకపోయినా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని మేనేజ్‌మెంట్ ఆందోళన చెందలేదు. సిక్స్త్ బౌలర్ కోసం వెంపర్లాడకుండా ఫైవ్ మెయిన్ బౌలర్లతోనే ముందుకు వెళ్లారు. ప్లేయర్లలో క్లారిటీ మిస్ అవ్వకుండా చూసుకుని ఫైనల్ వరకు తీసుకెళ్లారు. కానీ ప్రెజెంట్ గంభీర్ మేనేజ్‌మెంట్ 'బిట్స్ అండ్ పీసెస్' ప్లేయర్ల వెనక పడుతోంది, అందుకే టెస్టుల్లో కూడా ఇబ్బంది పడుతున్నాం" అని క్లారిటీ ఇచ్చాడు.

Continues below advertisement

Read Also: Asian Games Draw: 2026 ఏషియన్ గేమ్స్ విమెన్స్ క్వార్టర్స్ ప్రత్యర్థి ఖరారు.. మెన్స్ టీమ్ కు జాక్ పాట్..!

నెక్స్ట్ 14 మంత్స్ కోసం పక్కా రోడ్‌మాప్.. 18 మంది ప్లేయర్ల పూల్ డెసిషన్వరల్డ్ కప్ టోర్నీ గెలవాలంటే ప్రాపర్ మ్యాచ్ విన్నర్లు అవసరమని అశ్విన్ చెప్పాడు. "నెక్స్ట్ 14 మంత్స్ కోసం 17 లేదా 18 మంది ప్లేయర్ల పూల్ ను ఫైనలైజ్ చేసి వారికి పూర్తి క్లారిటీ ఇవ్వాలి. అందులో ఇద్ద‌రు వికెట్ కీపర్లు, ముగ్గురు స్పిన్నర్లు, ఐదుగురు పేసర్లు ఉండాలి. వరల్డ్ కప్ ఫస్ట్ డే నాటికి బెస్ట్ 11 ప్లేయర్లను ఫీల్డ్ లోకి దించే విజన్ తోనే వీరిని రొటేట్ చేయాలి. ప్రెజెంట్ ఉన్న టీమ్ మేనేజ్‌మెంట్ లో ఆ క్లారిటీ కంప్లీట్ గా మిస్ అవుతోంది" అని అశ్విన్ కామెంట్ చేశాడు.

ప్రాపర్ రోల్స్ తోనే వరల్డ్ కప్ విక్టరీ టీమ్ లో ప్రతీ ప్లేయర్ కి వారి రోల్ పై పక్కా క్లారిటీ ఉన్నప్పుడే వరల్డ్ కప్ గెలవడం సాధ్యమవుతుంది. మేకప్‌ ఆల్‌రౌండర్లతో ముందుకు వెళ్లడం వల్ల మెయిన్ టోర్నమెంట్లలో టీమ్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని, ఇప్పటికైనా గంభీర్ మేనేజ్‌మెంట్ మైండ్‌సెట్ మార్చుకోవాలని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.