ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పల్నాడు జిల్లా(Palnadu District)కు చెందిన అంధ క్రికెటర్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి(Valloori Ajay Kumar Reddy) అర్జున అవార్డు(Arjuna Award )కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన భారత్ అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. మాచర్ల(Macharla)లో పుట్టి పెరిగి.. నరసరావుపేట(Narasaraopeta)లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అజయ్ కుమార్.... అక్కడే క్రికెట్ ఆడటం నేర్చుకున్నారు. అంచలంచెలుగా అంధ క్రికెట్లో రాణిస్తూ భారత జట్టుకు ఆడటంతో పాటు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు. అర్జున అవార్డుకు అజయ్ ఎంపిక కావటంతో పలువురు అభినందనలు తెలిపారు.
ఏపీకి అవార్డులు
కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ఖేల్ రత్న(Khel Ratna Award), ద్రోణాచర్య(Dronacharya Award), అర్జున అవార్డు (Arjuna Awards 2023)లను ప్రకటించింది. బ్యాడ్మింటన్ ఆటగాళ్లు చిరాగ్ శెట్టి (Chirag Shetty), ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురానికి చెందిన రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ (Satwiksairaj Rankireddy)కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు (Major Dhyan Chand Khel Ratna Award)ను ప్రకటించారు. క్రీడల్లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన మరో 26 మందిని అర్జున అవార్డు వరించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి కేంద్రం అర్జున అవార్డు ప్రకటించింది. అయిదుగురు కోచ్ లకు ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు.