Amit Mishra Retirement: భారతీయ క్రికెటర్ అమిత్ మిశ్రా క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. తన నిర్ణయాన్ని ప్రకటించి భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అతను 2003లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు, 2024 వరకు IPLలో ఆడాడు. అమిత్ మిశ్రా ఇలా రాశాడు, "నేడు, 25 సంవత్సరాల తర్వాత, నేను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఇది నా మొదటి ప్రేమ, నా గురువు, నా ఆనందానికి అతిపెద్ద మూలం."
2003లో అంతర్జాతీయ అరంగేట్రం
అమిత్ మిశ్రా 2003లో దక్షిణాఫ్రికాతో తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడాడు. ఐదు సంవత్సరాల తర్వాత, అతను 2008లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. 2010లో T20లో అరంగేట్రం చేశాడు. అతను తన అంతర్జాతీయ క్రికెట్లో 22 టెస్టులు, 36 వన్డేలు, 10 T20 మ్యాచ్లు ఆడాడు, ఇందులో అతను వరుసగా టెస్టుల్లో76 వికెట్లు, వన్డేల్లో 64 వికెట్లు, టీ ట్వంటీల్లో 16 వికెట్లు పడగొట్టాడు.
అమిత్ మిశ్రా తన సోషల్ మీడియా అకౌంట్లో ఇలా రాసుకొచ్చాడు, "ప్రారంభ రోజుల్లోని పోరాటాలు, త్యాగాల నుంచి మైదానంలో గడిపిన గొప్ప క్షణాల వరకు, ప్రతి అధ్యాయం నన్ను క్రికెటర్గా , మనిషిగా మెరుగుపరిచిన అనుభవం. నా కుటుంబం నా ఒడిదుడుకులలో నాతో దృఢంగా నిల్చొంది, దానికి ధన్యవాదాలు. నా సహచరులు, మార్గదర్శకులు ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేశారు, వారికి ధన్యవాదాలు."
అమిత్ మిశ్రా చివరి అంతర్జాతీయ మ్యాచ్
అమిత్ మిశ్రా డిసెంబర్ 2016లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అక్టోబర్ 29న న్యూజిలాండ్తో జరిగిన వన్డే ఆడాడు, అదే అతని చివరి వన్డే. అతను చివరిసారిగా T20 ఆడే అవకాశం ఫిబ్రవరి 1, 2017న ఆడాడు, ఈ మ్యాచ్ బెంగళూరులో ఇంగ్లాండ్తో జరిగింది.
అమిత్ మిశ్రా IPL కెరీర్
లెగ్ స్పిన్నర్ ఐపీఎల్లో 4 జట్లకు ఆడాడు, అతను ప్రారంభం నుంచి ఈ టోర్నమెంట్లో భాగంగా ఉన్నాడు. చివరిసారిగా 2024లో ఆడాడు. అతని ప్రయాణం ఢిల్లీ క్యాపిటల్స్తో ప్రారంభమై లక్నో సూపర్ జెయింట్స్తో ముగిసింది. అతను IPLలో మొత్తం 162 మ్యాచ్లు ఆడాడు, దీనిలో అతని పేరు మీద 174 వికెట్లు ఉన్నాయి.