మే 7 శనివారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 07- 05 - 2022వారం: శనివారం  

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం

తిథి  :  షష్టి శనివారం ఉదయం 11.09 వరకు తదుపరి సప్తమివారం : శనివారం     నక్షత్రం:  పునర్వసు ఉదయం 9.06 తదుపరి పుష్యమివర్జ్యం :  సాయంత్రం 5.52 నుంచి 7.37  దుర్ముహూర్తం :  ఉదయం 7.17 నుంచి 8.59 తిరిగి మధ్యాహ్నం 12.22 నుంచి 1.13 వరకుఅమృతఘడియలు :  ఉదయం 6.16 నుంచి 7.17సూర్యోదయం: 05:36సూర్యాస్తమయం : 06:18

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉంటే ఏం జరుగుతుంది

శనిదోష నివారణకు పఠించాల్సిన శ్లోకాలు

శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు.కష్ట నష్టాల నుంచి బయపడేందుకు దేవాలయాల్లో శాంతులు, ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే శనివారం రోజు ప్రత్యేక పూజలు మాత్రమే కాదు శనిధ్యానం చేసినా ఆ ప్రభావం తగ్గుతుందని చెబుతారు. ఇవి కేవలం శనివారం మాత్రమే కాదు నిత్యం చదువుకోవచ్చు.

శని గాయత్రి: 

ఓం రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి

తన్నః శనిః ప్రచోదయాత్

శనిధ్యానం శ్లోకాలు

సూర్యపుత్రో దీర్ఘదేహఃవిశాలక్ష శ్శివప్రియ:మందచార: ప్రసన్నాత్మాపీడాం దహతు మే శని:

శన్యారిష్టే తు సంప్రాప్తేశనిపూజాంచ కారయేత్శనిధ్యానం ప్రవక్ష్యామిప్రాణి పీడోపశాంతయే

నీలాంజన సమాభాసంరవిపుత్రం యమాగ్రజంచాయా మార్తాండ సంభూతంతన్నమామి శనైశ్చరం!

నమస్తే రౌద్ర దేహాయనమస్తే చాంతకాయచనమస్తే యమ సంజ్ఞాయనమస్తే సౌరాయే విభో !!

నమస్తే మంద సంజ్ఞాయశనైశ్చర నమోస్తుప్రసాదం మమదేవేశదీనస్య ప్రణతస్యచ!!

నమస్తే కోణ సంస్థాయపింగళాయ నమోస్తుతేనమస్తే బభ్రు రూపాయకృష్ణాయచ నమోస్తుతే !! 

నిత్యం ఈ శ్లోకాలు చదవడం వల్ల ఏలినాటి, అష్టమ, అర్దాష్టమ శనిదోష నివారణతో పాటూ అనుకున్న కార్యాలు నెరవేరుతాయని పండితులు చెబుతారు.

Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు

Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు