Puri Jagannath Temple Calendar 2026: ఒడిశాలోని పూరీలో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయ కమిటీ డిసెంబర్ 31న ప్రజలకు క్షమాపణలు చెప్పింది. 12వ శతాబ్దానికి చెందిన ఈ అద్భుతమైన ఆలయంలోని రత్న సింహాసనంపై కూర్చున్న శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్రల చిత్రాలను తప్పుగా చూపిన 2026 క్యాలెండర్‌పై నిషేధం విధించింది. శ్రీ జగన్నాథ ఆలయ కమిటీ (SJTA) ప్రకారం, 2026 క్యాలెండర్‌లో ప్రచురించిన చిత్రాలు ఒడిశా రాష్ట్ర మ్యూజియంలో భద్రపరచిన శతాబ్దాల నాటి తాటి ఆకుల తాళపత్ర గ్రంథాల నుంచి ప్రేరణ పొందాయి. క్యాలెండర్‌పై ముద్రించిన కళాకృతి ఆ కాలపు చిత్రకారుడి శైలిని ప్రతిబింబిస్తుందని, మతపరమైన భావాలను కించపరచడం దీని ఉద్దేశ్యం కాదని వారు తెలిపారు. SJTA తన ప్రకటనలో, ఇది ఆ కాలపు చిత్రకారుడి కళ అని పేర్కొంది. జగన్నాథ స్వామి భక్తులు దీనిని తప్పుగా అర్థం చేసుకోరని ఆశిస్తున్నాము అని పేర్కొంది

Continues below advertisement

ఆలయ అధికారులు క్యాలెండర్ అమ్మకాలపై నిషేధం విధించారు

ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల చిత్రాలను ఆలయంలో సరిగ్గా చిత్రీకరించలేదని రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో క్యాలెండర్ అమ్మకాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. ఆలయ నిర్వాహకులు క్యాలెండర్ అమ్మకాలను నిలిపివేయాలని, అనుకోకుండా జరిగిన పొరపాటుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అధికారులను ఆదేశించారు. ఆలయ కమిటీ విడుదల చేసిన టేబుల్, క్యాలెండర్, వాల్ క్యాలెండర్లలో తప్పుగా చిత్రాలు ముద్రించారు. 

Continues below advertisement

చిత్రంలో బలభద్రుడిని శ్రీ జగన్నాథుడి స్థానంలో చూపించారు, ఇది సంప్రదాయాలకు విరుద్ధం

పాత కళాకృతిని ఉపయోగించే ముందు SJTA నిపుణుల సలహా తీసుకోలేదని BJD ప్రతినిధి మొహంతి తెలిపారు.

ఏ తప్పుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు?

క్యాలెండర్‌లో చాలా తప్పులున్నాయి, వాటిని చూసిన తర్వాతే అమ్మకాలపై నిషేధం విధించారు. త్రిమూర్తుల చిత్రాలను తప్పు స్థానంలో ఉంచడం.

ఇందులో పాత రథయాత్ర చిత్రం కూడా ఉంది, అందులో దేవి సుభద్ర రథం ముందుగా లాగుతున్నట్టుం ఉంది.. ఆ తర్వాత శ్రీ జగన్నాథుడి నందిఘోష రథం, చివరగా బలభద్రుడి తాలధ్వజ రథం ఉన్నాయి. మరో తప్పు ఏంటంటే, త్రిమూర్తుల చిత్రాలు తప్పుగా ప్రచురించారు. శ్రీ జగన్నాథుడి స్థానంలో బలభద్రుడి చిత్రాన్ని చూపించారు, బలభద్రుడి చిత్రం ఉండాల్సిన చోట శ్రీ జగన్నాథుడి చిత్రాన్ని చూపించారు. ఈ తప్పులపై ఆలయ సేవకులతో పాటు పలువురు తీవ్ర విమర్శలు చేశారు.

సాధారణంగా  రత్న సింహాసనంపై బలభద్రుడు ఎడమవైపు..సభద్ర మధ్యలో..జగన్నాథుడు కుడివైపు ఉంటారు. కానీ ఈ క్యాలెండర్లో క్రమం మారింది. బలభద్రుడి స్థానంలో జగన్నాథుడు..జగన్నాథుడి స్థానంలో బలభద్రుడు ఉన్నట్టు ముద్రించారు. రథాయాత్రలో రథాల క్రమం కూడా తప్పుగా చూపించారు. ముందుగా బలభద్రుడి రథం కదులుతుంది..సుభద్ర రథం మధ్యలో..చివర్లో జగన్నాథుడి రథం ఉంటుంది. ఈ క్రమం కూడా మార్చి ముద్రించారు

నిరాకరణ: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ABPLive.com ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.