Ganesh Chaturthi 2022 Live Updates: ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తమిళిసై తొలిపూజ

Ganesh Chaturthi 2022 Live Updates: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి 2022 వేడుకలు ప్రారంభమయ్యాయి. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

ABP Desam Last Updated: 31 Aug 2022 01:04 PM

Background

"శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"భారతదేశంలోని అతి ముఖ్యమైన హిందువుల పర్వదినం "వినాయక చవితి". శివపార్వతుల కుమారుడైన గణనాథుడి జన్మదినాన్ని పురస్కరించుకుని "వినాయక చవితి" జరుపుకుంటారు. ఈ పండుగ భాద్రపద మాసంలో నాలుగో రోజు..అంటే చవితి రోజు...More

Kanipakam Temple: గణపతికి పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

తిరుపతి : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని , శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమై శ్రీకాళహస్తి మాడవీధులలో కొలువై ఉన్న నవసంది గణపతులకు శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను సమర్పించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు, దేవస్థానం పాలకమండలి కమిటీ సభ్యులు.. గణపతులకు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఆయా ఆలయాల వద్ద గణపతి ప్రతిమలను భక్తులకు పంపిణీ చేసారు.. నవసందీ గణపతులకు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో అఘోరాలు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. విఘ్నేశ్వరులకు పట్టు వస్త్రాలు సమర్పణ అనంతరం అఘోరాలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఆశీర్వదించారు..