= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Kanipakam Temple: గణపతికి పట్టువస్త్రాలు సమర్పించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తిరుపతి : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని , శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమై శ్రీకాళహస్తి మాడవీధులలో కొలువై ఉన్న నవసంది గణపతులకు శాస్త్రోక్తంగా పట్టువస్త్రాలను సమర్పించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ ఈవో సాగర్ బాబు, దేవస్థానం పాలకమండలి కమిటీ సభ్యులు.. గణపతులకు పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఆయా ఆలయాల వద్ద గణపతి ప్రతిమలను భక్తులకు పంపిణీ చేసారు.. నవసందీ గణపతులకు పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో అఘోరాలు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. విఘ్నేశ్వరులకు పట్టు వస్త్రాలు సమర్పణ అనంతరం అఘోరాలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఆశీర్వదించారు..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Kanipakam: కాణిపాకంలో వైభవంగా చవితి వేడుకలు సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం ప్రాతఃకాల ఆరాధనతో స్వామి వారిని మేలు కొల్పిన అర్చకులు, ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం స్వామి వారి దర్శనార్ధం భక్తులను అనుమతిస్తున్నారు ఆలయ అధికారులు.. కాణిపాకం ఆలయంలో నేటి నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుంది.. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు కాణిపాకం క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగనుంది.. వినాయక చవితి పురష్కరించుకుని ఆలయంను వివిధ రకాల పుష్పాలు, పండ్లతో అందంగా తీర్చి దిద్దారు.. వినాయక చవితి నాడు బొజ్జ గణపయ్యను దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు ఆలయంకు చేరుకుంటున్నారు..
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలిపూజ వినాయక చవితి పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహా గణపతికి గవర్నర్ తొలి పూజ చేశారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరిని ఐకమత్యంగా ఉంచేవి గణపతి ఉత్సవాలు అని తమిళిసై అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా పాల్గొన్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ganesh Chaturthi 2022: విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు: సీఎం జగన్ ఏపీ ప్రజలకు సీఎం వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షాలు తెలిపారు. విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు అన్నారు.. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Ganesh Chaturthi 2022: సకల శాస్త్రాలకు అధిపతి, బుద్ధి ప్రదాత వినాయకుడు: సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధి ప్రదాతగా ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథున్ని ఆరాధిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లి విరిసేలా, ఆనందంతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు: ప్రధాని మోదీ దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ముక్తిని కోరుకునేవారికి తెలివితేటలు అజ్ఞానాన్ని నాశనం చేస్తాయి, ఎందుకంటే సంపద భక్తుడికి సంతృప్తినిస్తుంది. ఎవరి వల్ల ఆటంకాలు నశింపబడతాయో, ఎవరి నుండి కార్యం సిద్ధిస్తుందో ఆ వినాయకుడిని నిత్యం నమస్కరించి పూజిస్తాం. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మీ ఇంట సకల శుభాలు కలగాలి: చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి తెలుగు దేశం పార్టీ అధినేత శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని దయతో మీ ఇంట సకల శుభాలు కలగాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటోందని ట్వీట్ చేశారు.