Is Political Deal Behind Kavitha bail  :  భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై విడుదలయ్యారు. మార్చి  పదిహేనో తేదీ నుంచి ఆమె  తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు అంతా  పూర్తి చేశామని కోర్టుకు చెప్పాయి. ఇక ట్రయల్ ఉంది. ట్రయల్ కు ముందే జైల్లో ఉంచడం కరెక్ట్ కాదని బావించిన  సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు మనీష్ సిసోడియాకూ బెయిల్ వచ్చింది. కేజ్రీవాల్‌కి కూడా ఇదే గ్రౌండ్స్ పై బెయిల్ వస్తుందని న్యాయనిపుణుల అంచనా. అయితే కవితకు వచ్చిన బెయిల్ పై తెలంగాణలో మత్రం భిన్నమైనరాజకీయ చర్చ నడుస్తోంది. పొలిటికల్ డీల్ కారణంగానే ఈ బెయిల్ వచ్చిందని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 


బండి సంజయ్ ఆరోపణలతో కలకలం


కవితకు బెయిల్ మంజూరైన కొద్ది సేపటికే  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ట్వీట్ పెట్టారు. కవితకు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన ఆరోపించారు. రాజ్యసభకు తెలంగాణ నుంచి ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వినే కవిత బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వాదించారని దీన్ని బట్టి కాంగ్రెస్,  బీఆర్ఎస్ మధ్య పరస్పర అవగాహనతో ఉన్నాయని అర్థమవుతుందని ఆయన ఆరోపించారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు నిబద్ధతను  ప్రశ్నించేలా .. బండి సంజయ్ తీరు ఉందని ఆయనపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సుప్రీంకోర్టును కోరుతూ ట్వీట్ చేశారు. నిజానికి బండి సంజయ్ కొంత కాలంగా కవితకు బెయిల్ కాంగ్రెస్సే ఇప్పిస్తోందని ఆరోపిస్తున్నారు. దీనికి కారణం.. బీజేపీతో బీఆర్ఎస్ పొలిటికల్ డీల్ చేసుకోవడం వల్లే కవితకు  బెయిల్ వస్తోందన్న ప్రచారం ఉద్ధృంగా సాగడమే. 


అమెరికాకు వెళ్లిన కరీంనగర్ మేయర్, నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ - రీజన్ ఏంటంటే!


పొలిటికల్ డీలేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్ 


మరో వైపు కవిత  బెయిల్ కోసం రెండు, మూడు సార్లు ఢిల్లీలో పర్యటించిన తర్వాత కేటీఆర్ చేసిన వ్యాఖ్యల కారణంగా  బీఆర్ఎస్,  బీజేపీ మధ్య డీల్ కుదిరిందని అందుకే బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రె్స పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇదే ఆరోపణలను బలంగా చేశారు. కేటీఆర్ రెండు రోజుల నుంచి  బెయిల్ వస్తుందని హడావుడి చేస్తున్నారని నాలుగురోజుల నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితకు బెయిల్ వచ్చినట్లేనని చెబతోందని గుర్త చేశారు. తీర్ప చదివే వరకూ కోర్టులో ఉన్న వారికి కూడా తెలియదని కానీ సుప్రీంకోర్టు తీర్పులను.. బీఆర్ఎస్ ముందే చెప్పేస్తోందని ఆరోపించారు. ఇతర కాంగ్రెస్ నేతలు.. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఇదే తరహా ఆరోపణల్ని బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్తోంది. 


బుల్లెట్లు దిగవు కానీ బుల్డోజర్లు దిగుతాయి - హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఫాతిమా ఓవైసీ కాలేజీనే !


కేటీఆర్ ఢిల్లీ టూర్లు.. బెయిల్ పై చేసిన వ్యాఖ్యలే కారణం !


కవిత జైలుకు వెళ్లిన తర్వాత కేటీఆర్, హరీష్ రావు రెండు, మూడు సార్లు ఢిల్లీకి వెల్లారు. ఈ సందర్భంగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులు లేదా విలీనాలపై చర్చలు జరిగాయని  జోరుగా ప్రచారం సాగింది. వాటిని బీఆర్ఎస్ బలంగా ఖండించలేదు. అదే సమయంలో కవితకు బెయిల్ ప్రాసెస్ లో వస్తుందని తదుపరి విచారణలో బెయిల్ వస్తుందని కేటీఆర్ బలంగా చెబుతూ వస్తున్నారు. ఇదంతా ఢిల్లీ చర్చల మహిమేనని ఇతర పార్టీలు ప్రచారం చేయడానికి ఇదో కారణంగా మారింది. నిజానికి కవిత ఐదున్నర నెలల వరకూ బెయిల్లో ఉన్నారు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు కూడా పూర్తయినందున సాక్షుల్ని ప్రభావితం చేయడం.. దర్యాప్తును ప్రభావితం చేయడం అన్న సమస్య ఉండదు కాబట్టి నిందితుకు బెయిల్ ఇస్తారని న్యాయవర్గాలు అంచనా వేశాయి.  కానీ కేటీఆర్ చేసిన ప్రకటనలు.. ఢిల్లీ చర్చల పుకార్ల వల్ల.. కవిత బెయిల్ వెనుక పొలిటికల్ డీల్ ఉందన్న ప్రచారం జరగడానికి కారణం అయిందని అనుకోవచ్చు.