BJP Strategy Rahul Gandhi:  ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వెలుపల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ధర్నా, ఆందోళన సందర్భంగా ఆయన గాయపడటం జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించడమే కాకుండా, అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదానికి కారణమైంది. అయితే,పైకి కనిపించే ఈ రాజకీయ నిరసన వెనుక అత్యంత సంక్లిష్టమైన వ్యూహాత్మక రాజకీయ కోణం ఉందనే చర్చ ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో జోరుగా సాగుతోంది.

Continues below advertisement

రాహుల్‌కు ఆ అవకాశం బీజేపీనే కల్పించిందా?  

రాహుల్ గాంధీకి ఈ స్థాయిలో నిరసన తెలిపేందుకు,   మీడియాలో భారీ స్పేస్ ఆక్రమించేందుకు అధికార బీజేపీయే వ్యూహాత్మకంగా అవకాశం కల్పించిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఏదీ యాదృచ్ఛికంగా జరగదనే నానుడికి తగినట్లుగా, కాంగ్రెస్ అగ్రనేతను ఒక పావులా వాడుకుని పెద్ద ఎత్తున ప్రజా దృష్టిని వేరే అంశాల వైపు మళ్లించే ప్రయత్నం జరిగిందన్న భావన వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఈ హై-వోల్టేజ్ ఆందోళనను అధికార పక్షం తమకు అనుకూలమైన ఒక వ్యూహాత్మక ఆయుధంగా మలచుకుందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో బలపడుతున్నాయి.

Continues below advertisement

కాక్రోచ్‌ల నుంచి డైవర్షన్ కోసమే? 

ప్రస్తుతం దేశంలో తీవ్రరూపం దాల్చుతున్న  సిజెపి  ఆందోళనలు, కాక్రోచ్‌ల ఉద్యమం  వంటి తీవ్రమైన ప్రజా ఆగ్రహ ఉద్వేగాలను పక్కదారి పట్టించడానికి లేదా వాటి ఉధృతిని తగ్గించడానికి ఈ ధర్నా ఒక సేఫ్టీ వాల్వ్‌లా ఉపయోగపడిందనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. ప్రజా సమస్యలపై జరుగుతున్న ఈ ఉగ్ర పోరాటాల తీవ్రతను కప్పిపుచ్చేందుకు, ప్రజల మరియు మీడియా దృష్టిని పూర్తిగా రాహుల్ గాంధీ చేపట్టిన నిరసన వైపు మళ్లించేందుకు ఇదొక చక్కటి వ్యూహంగా అమలు చేశారని  భావిస్తున్నారు. తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ఇలాంటి నాటకీయ పరిణామాలు దోహదపడతాయని భావిస్తున్నారు.  ఈ పరిణామం ద్వారా అధికార పక్షానికి ఒక రకమైన వ్యూహాత్మక ప్రయోజనం చేకూరినట్లు కనిపిస్తోంది. సున్నితమైన ఉద్యమాల నుంచి దృష్టిని వేరే వైపు మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ధర్నా ఒక కంట్రోల్డ్ ఆపోజిషన్  వ్యూహంలో భాగమనే అనుమానాలు బలపడుతున్నాయి. రాహుల్ గాంధీకి తగినంత స్పేస్ ఇవ్వడం ద్వారా అసలు సమస్యల మూలాలను తెరవెనుకకు నెట్టి, కేవలం వ్యక్తిగత లేదా పార్టీ కేంద్రీకృత అంశాలపై చర్చ జరిగేలా చూడటంలో బీజేపీ వ్యూహం సఫలమైందనే చెప్పాలి.

కాక్రోచ్‌లకు తగ్గిపోయిన మీడియా అటెన్షన్ 

 మీడియా దృష్టిని పూర్తిగా మోదీ నివాస ఆందోళన , రాహుల్ గాంధీ గాయం చుట్టూ కేంద్రీకరించడం ద్వారా, దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్న ఇతర ప్రజా ఉద్యమాల వేగం ఆకస్మికంగా నెమ్మదించింది. మీడియాలో ప్రధాన హెడ్‌లైన్స్ అన్నీ రాహుల్ ధర్నా గురించే రావడంతో,  కాక్రోచ్‌ల ఉద్యమం, సిజెపి ఆందోళనల తీవ్రత కొంతమేర కిందికి దిగివచ్చింది. ఇది అధికార పార్టీకి వ్యూహాత్మకంగా అతిపెద్ద ఊరటనిచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ మొత్తం వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ తాము ఒక పెద్ద పోరాటం చేశామని భావిస్తున్నప్పటికీ, వాస్తవానికి అది అధికార పార్టీ వ్యూహంలో భాగస్వామ్యం కావడమేనని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని భావించిన రాహుల్ గాంధీకి స్పేస్ దక్కినప్పటికీ, దానివల్ల అసలు ప్రజా సమస్యల తీవ్రత నీరుగారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నుంచి దృష్టిని మళ్లించే డెకాయ్   రాజకీయాలకు కాంగ్రెస్ మరోసారి బలయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ కుమైలేజీ కన్నా బీజేపీకే ఎక్కువ లాభం?

ప్రధాని నివాసం వెలుపల రాహుల్ గాంధీ చేసిన ధర్నా ,  ఆ సందర్భంగా జరిగిన పరిణామాలు కేవలం ఒక సాధారణ నిరసన ప్రదర్శన మాత్రమే కాదని, ఇదొక పెద్ద రాజకీయ మైండ్ గేమ్‌గా స్పష్టమవుతోంది. తీవ్రమైన ప్రజా ఉద్యమాలను నీరుగార్చేందుకు అధికార పక్షం అందించిన సేఫ్టీ వాల్వ్ స్పేస్‌ను కాంగ్రెస్ వాడుకోవడం ద్వారా, తాత్కాలిక రాజకీయ లబ్ధి పొందినట్లు కనిపించినా దీర్ఘకాలికంగా మాత్రం క్షేత్రస్థాయి ఉద్యమాల తీవ్రత దెబ్బతిన్నదనేది ఎక్కువ మంది భావన.