Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా ఆర్మీ జవాన్ హఠాన్మరణం - ట్రైనింగ్లో రన్నింగ్ చేస్తూ కుప్పకూలి మృతి
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్త మాన్నూర్ గ్రామానికి చెందిన నలువాల ఆకాష్ (23) దేశ సేవ చేయాలనే లక్ష్యంతో మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ఆర్మీలో చేరాడు.
Adilabad Latest News: అసోం రెజిమెంటల్ విభాగంలో శిక్షణలో భాగంగా 20 కిలోమీటర్ల పరుగు సాధనలో కుప్ప కూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది.
Adilabad Latest News: నలువాల ఆకాష్ దేశ సేవ చేయాలన్న కోరిక తీరక ముందే అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఆకాష్ మృతదేహాన్ని చూసి తల్లి గుండెలవిసేలా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.
Adilabad Latest News: ఇచ్చోడ మండల కేంద్రం నుంచి వర్తమాన్నూర్ స్వగ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల పొడవునా అంతిమయాత్ర నిర్వహించారు.
Adilabad Latest News: బజార్హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామానికి చెందిన ఆకాష్ దేశ సేవ చేయాలనే ఆకాంక్షతో ఆర్మీ జవాన్ గా ఎంపికై అసోం రెజిమెంటల్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు.
Adilabad Latest News: శిక్షణ శిబిరంలో ఉన్న సమయంలో పరుగు సాధనలో పాల్గొని అలసటతో కుప్పకూలాడు. ఆ తర్వాత అక్కడే ఆర్మీ ఆసుపత్రికి తరలించగా డిహైడ్రేషన్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Adilabad Latest News: నలువాల ఆకాష్ మృతదేహం మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రానికి చేరుకోగానే భారీ సంఖ్యలో యువకులు, వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి నివాళులర్పించారు.
Adilabad Latest News: ఇచ్చోడ మండల కేంద్రం నుంచి వర్తమాన్నూర్ స్వగ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల పొడవునా అంతిమ యాత్ర నిర్వహించారు.
Adilabad Latest News: యువకులు జాతీయ పతాకాలతో బైక్ ర్యాలీ నిర్వహించి వీర సైనికునికి ఘనంగా నివాళులర్పించారు. స్వగ్రామమైన వర్త మన్నూరులో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సహచర జవాన్లు గౌరవ వందనం చేసి వీడ్కోలు పలికారు.