In Pics: ‘జయహో కేసీఆర్’ అంటున్న కరీంనగర్ రైతులు - పొల్లాల్లో భారీ కటౌట్లు, పాలాభిషేకాలు
ABP Desam | 13 Apr 2022 11:59 AM (IST)
1
తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై సంబరాలు వ్యక్తం అవుతున్నాయి.
2
కరీంనగర్ జిల్లాలోని దుర్షేడ్ గ్రామంలో రైతులు సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్ కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు.
3
బుధవారం గ్రామంలోని వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలు చేశారు.
4
అనంతరం రైతులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజలు తామే ఉంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారు.
5
జయహో కేసీఆర్ అంటూ కటౌట్లు తయారు చేసి పొలాల్లో ప్రదర్శిస్తూ ఆనందం వ్యక్తం చేయడం ఆకట్టుకుంది