✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

KCR Nanded Meeting: బీఆర్ఎస్ సర్కార్‌ రాగానే మహారాష్ట్రలో 24 గంటల కరెంటు: కేసీఆర్

ABP Desam   |  05 Feb 2023 08:50 PM (IST)
1

భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీ మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది.

2

వనరులు ఉన్నా ప్రభుత్వాల చేతకాని పరిస్థితుల వల్లే ఇది జరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

3

దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉందని ఆవేదన చెందారు.

4

ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేశారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

5

ఇన్నేళ్లయినా చాలా గ్రామాల్లో తాగునీరు, సాగు నీరు లేదన్నారు. కరెంట్‌ సదుపాయం లేకుండా వందల గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు.

6

మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు.

7

దేశంలో నాయకత్వ మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు.

8

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో స్థానిక ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. ఎంత కష్టం, ఆవేదన ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందో ఆలోచించాలన్నారు.

9

దేశానికి అన్నంపెట్టే రైతన్నల ఉసురు తీసుకోవడం శ్రేయస్కరం కాదన్నారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని నినదించిన పార్టీ దేశంలో బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్నారు.

10

ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ మహారాష్ట్రకు రోటీ - భేటీ బంధం ఉందన్నారు.

11

బీఆర్ఎస్ స‌భా వేదికపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మ‌ర‌ఠా యోధుల‌కు సీఎం కేసీఆర్ పుష్పాంజ‌లి ఘ‌టించారు. మహానుభావులకు కేసీఆర్ తో పాటు నేతలు నివాళుల‌ర్పించారు.

12

నిత్యం తెలంగాణకు వచ్చేవాళ్లంతా అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో రైతు బీమాతో కుటుంబాలకు భరోసా దొరికిందన్నారు.

13

సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌తో పాటు ప‌లువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.

14

రైతు ఏ కారణంతో చనిపోయినా వారం రోజుల్లో రూ.5 లక్షలు సాయం అందిస్తున్నామన్నారు.

15

మహారాష్ట్రలో గులాబీ సర్కార్‌ రాగానే 24 గంటల కరెంటు వస్తుందన్నారు. నాయకులు అంటే ఎక్కడి నుంచో రారని, మీ నుంచే వస్తారన్నారు.

16

నాందేడ్ జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. అనంతరం కేసీఆర్ నాందేడ్ లోని చారిత్రక గురుద్వారాను సంద‌ర్శించారు.

17

గురుద్వారాకు వెళ్లిన సీఎం కేసీఆర్‌కు సిక్కు మ‌త‌గ గురువులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం గురుద్వారాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక ప్రార్థన‌లు చేశారు. సీఎం కేసీఆర్ గురుద్వారా వద్ద సిక్కు మ‌త గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • KCR Nanded Meeting: బీఆర్ఎస్ సర్కార్‌ రాగానే మహారాష్ట్రలో 24 గంటల కరెంటు: కేసీఆర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.