In Pics: భారత పారాలింపిక్స్ అథ్లెట్లకు ఘన స్వాగతం... పతకాలతో క్రీడాకారుల సందడి
టోక్యో పారాలింపిక్స్లో పాల్గొని తిరిగి భారత్ వచ్చిన అథ్లెట్లకు ఘన స్వాగతం లభించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదిల్లీ చేరుకున్న వీరికి పూలమాలలు వేసి సత్కరించారు SAI సిబ్బంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఈసారి పారాలింపిక్స్లో 19 పతకాలు సాధించింది.
ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.
19 పతకాలతో భారత్ 24వ స్థానంలో నిలిచింది.
హర్యానా స్పోర్ట్స్ మినిస్టర్తో పాటు భారత హాకీ మాజీ ఆటగాడు సందీప్ సింగ్ ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు.
అభిమానులు కూడా పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకుని క్రీడాకారులకు స్వాగతం పలికారు.
విశ్వ క్రీడలు టోక్యో పారాలింపిక్స్ 2020 ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ గురువారం పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
సోమవారం ఉదయం కొంతమంది క్రీడాకారులు భారత్ చేరుకోగా... మిగిలిన వారు సాయంత్రానికి భారత్ చేరుకున్నారు.
స్వర్ణం, కాంస్యం గెలిచిన అవని లేఖరాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.