Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సిరులతల్లికి సారె!
RAMA | 06 Dec 2024 11:45 AM (IST)
1
తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సిరులతల్లి పద్మావతి అమ్మవారికి సారె సమర్పించారు.ఏటా పంచమితీర్థం రోజు తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.
2
శ్రీవారి ఆలయంలో వేకువజామున 2.30 నుంచి పరిమళాన్ని..విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. ఆ తర్వాత శ్రీవారి వక్షఃస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు.
3
వేకువజామున 4.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది.
4
అమ్మవారికి తీసెకళ్లే సారెను మాడ వీధుల్లో ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతి అలిపిరి వద్దకు తీసుకెళ్లారు.
5
శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.