బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుదల! లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఈ చవకైన వస్తువులను ఇంటికి తీసుకురండి!
దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరిని పూజించే ఆచారం ఉంది. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తారు. మరికొందరు దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీపూజలో బంగారం ఉంచి పూజిస్తారు. కానీ బంగారం, వెండి ధరలు భారీగా పెరగాయ్ అందుకే మీరు ఈ వస్తువులు కొనుగోలు చేయడం మంచిది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం బంగారం-వెండి ధరల కారణంగా సామాన్యులకు బంగారం కొనడం కష్టంగా మారింది. బంగారం వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొనుగోలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది
ప్రస్తుత సమయంలో వెండి ధర రిటైల్ మార్కెట్లో కిలో 2 లక్షల రూపాయలకు చేరుకుంది, బంగారం ధర 10 గ్రాములకు 1.30 లక్షల రూపాయలకు చేరుకుంది. దీని కారణంగా, ఈ సమయంలో ఆభరణాలు లేదా వెండి పాత్రలు-నాణేలు కొనడం అంటే సాధారణవిషయం కాదు
దీపావళి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శ్రీయంత్రం కొనుగోలు చేసి ఇంట్లో , కార్యాలయంలో పూజలో ఉంచితే కలిసొస్తుంది
బంగారం , వెండి బదులు దీపావళి రోజు లక్ష్మీదేవి విగ్రహం లేదా దక్షిణావృత్త శంఖాన్ని కొనండి. సముద్ర మథనం నుంచి వచ్చిన దక్షిణావృత్త శంఖాన్ని లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు.
గోమతి చక్రాలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది ఒక రాయి, ఇది అనేక రంగులలో ఉంటుంది, కానీ ఈ రోజున తెల్లటి రాయికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీరు ఈ రత్నాన్ని ఉంగరంలో ఉంచి కూడా ధరించవచ్చు. ధనత్రయోదశి రోజున రెండు లేదా ఐదు గోమతి చక్రాలను కొని ఉంచుకుని, దీపావళి రోజున లక్ష్మీదేవికి సమర్పించండి, దీనివల్ల విశేష లాభం కలుగుతుంది.