Kashmir: అనంతనాగ్ లో జలపాతం నుంచి బయటపడిన పురాతన శివలింగం, ఇతర విగ్రహాలు ఇవే!
అనంతనాగ్ లో పురాతన శివలింగం , దేవతా విగ్రహాలు లభించాయి. విగ్రహాలు ఒక పవిత్రమైన నీటి బుగ్గలో ఉన్నాయి. ఈ విగ్రహాలు 7వ-9వ శతాబ్దానికి చెందినవి.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ మధ్యకాలంలో నీటిమట్టం తగ్గడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు జలపాతం లోపల ఒక చిన్న పెట్టె లాంటి రాతి నిర్మాణాన్ని గుర్తించారు. ఇందులోంచి విగ్రహాలు బయపడ్డాయి
కూలీలు వెంటనే సలుయా పంచల్పోరా నాగబల్ కమిటీ అధ్యక్షుడు సతరు జీకి సమాచారం అందించారు, ఆయన విగ్రహాలను భద్రపరచాలని సలహా ఇచ్చారు.ఆ విగ్రహాలు మేం దాచిపెట్టొచ్చు కానీ అవి పవిత్రమైనవి అని తెలుసు..అందుకే ఆ రోజు నుంచి రాత్రి సమయంలోనూ విగ్రహాల దగ్గర కాపలా కాస్తున్నాం అని అక్కడ పనిచేసే కూలీలు చెప్పారు
స్థానికంగా కర్కూట్ నాగ్ అని పిలిచే ఈ ప్రదేశం కాశ్మీరీ పండితులకి ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. చాలా మంది దీనిని 7వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు కాశ్మీర్ ను పాలించిన కర్కూట్ రాజవంశంతో అనుసంధానిస్తారు.
స్థానిక వివరాల ప్రకారం, ఈ జలపాతం రాజవంశ పాలకులు ప్రార్థనలు చేసిన ప్రారంభ ప్రదేశాల్లో ఒకటి. ఇది తరతరాలుగా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఉంది.
ఈ ప్రాంతానికి చెందిన కాశ్మీరీ పండిట్ సన్నీ రైనా మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక జలపాతం మాత్రమే కాదు, ఇది మన సజీవ చరిత్రలో భాగం. కర్కోట రాజులు ఇక్కడే తమ మొదటి ఆచారాలు నిర్వహించారని నమ్ముతారు. ఈ పరిశోధన ఆ సంబంధాన్ని ధృవీకరిస్తుంది. జమ్మూ కాశ్మీర్ ఆర్కైవ్స్, పురావస్తు మ్యూజియంల విభాగం అధికారులు ఈ స్థలాన్ని సందర్శించారు.
ఒక అధికారి మాట్లాడుతూ విగ్రహాల వయస్సు మూలాన్ని తెలుసుకోవడానికి వాటిని మెటీరియల్ , కార్బన్ డేటింగ్ పరీక్ష కోసం శ్రీనగర్ కు పంపుతామని చెప్పారు.
స్థానిక ముస్లిం సమాజం ప్రదర్శించిన మత సామరస్యం, వారు విగ్రహాలను రక్షించడమే కాకుండా, వాటిని గౌరవించారు.