పూజలు చేస్తే మాత్రమే కాదు ఇవి అనుసరిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం!
ధార్మిక విశ్వాసాల ప్రకారం లక్ష్మి కేవలం ధనానికి సంబంధించిన దేవత మాత్రమే కాదు... ప్రపంచానికి భౌతిక సుఖం, సమృద్ధి, వైభవాన్ని అందిస్తుంది. పైగా కష్టపడితేనే లక్ష్మీదేవి వైభవం శాశ్వతంగా ఉంటుందని చెబుతారు పండితులు
లక్ష్మి ఆది శక్తి రూపం ప్రపంచానికి భౌతిక సుఖం, వైభవం, సంపదను అందిస్తుంది.
త్రిమూర్తులలో విష్ణువును పోషకుడు అని పిలుస్తారు.. లక్ష్మి ఆయనను పోషించే శక్తి. అందువల్ల ఆమెను ‘శ్రీ విష్ణు పత్ని’ అని పిలుస్తారు. ఎక్కడైతే పోషణ గురించి ఉంటుందో, అక్కడ లక్ష్మి వైభవం అనివార్యంగా ముడిపడి ఉంటుంది. ఈ కారణంగా జంట రూపంలో లక్ష్మి-విష్ణువుల పూజ ఎక్కువ ఫలవంతమైనదిగా పరిగణిస్తారు
దేవతలు, రాక్షసుల సంయుక్త ప్రయత్నంతో జరిగిన ‘సముద్ర మథనం’లో పదహారు రత్నాలు వచ్చినప్పుడు, వాటిలో లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది అని చెబుతారు. ఇది ఐక్యత, శ్రమ, కృషి ద్వారానే ప్రపంచంలోని దాగి ఉన్న సంపదలను పొందవచ్చని సూచిస్తుంది. సాధారణంగా శ్రమయే నిజమైన సాధన, ఇది లక్ష్మి కృపను పొందడానికి మార్గం కూడా.
లక్ష్మి కేవలం ధనానికి మాత్రమే అధిపతి కాదు.. శ్రమ పట్టుదలకు కూడా ప్రేరణనిస్తుంది అని చెబుతారు. కష్టపడి పనిచేసేవాడే అభివృద్ధి చెందుతాడు అనేది ఆమె సందేశం. దానం, ధర్మం లేదా సామాజిక సేవ వంటి జీవితంలోని ప్రతి రంగంలోనూ ధనానికి స్థానం ఉంది.
హిందూ ధర్మంలో దానం లక్ష్మిని పొందేందుకు ఉత్తమ మార్గంగా పరిగణిస్తారు. దానం చేయడం వల్ల లక్ష్మి దేవి సంతోషిస్తుందని, ఆమె ఎవరిపై దయ చూపుతుందో వారు సంపన్నులవుతారని నమ్మకం. అదే సమయంలో, ఆమె కోపించినట్లయితే, రాజు కూడా పేదవాడిగా మారతాడు.
లక్ష్మిని 'చంచల' అని పిలుస్తారు, ఎందుకంటే ఆమె స్థిరంగా ఉండదు. ధనం వస్తూ పోతూ ఉంటుంది. ఇదే జీవిత సత్యం, సంపద క్షణికమైనది. అందువల్ల శాశ్వతమైన సుఖ మార్గం సమతుల్యత, సంయమనం దానంలో ఉంది.