Kartik Purnima 2025: కార్తీక పూర్ణిమ రోజు తులసి తెంపవద్దు, ఇంట్లో ఏమూల చీకటిగా ఉంచొద్దు..ఇంకా ఇవి పాటించండి!
కార్తీక పూర్ణిమను సంవత్సరంలో అత్యంత పవిత్రమైన పూర్ణిమగా భావిస్తారు. నమ్మకం ప్రకారం, ఈ రోజున దేవతలు కూడా స్వర్గం నుంచి భూలోకానికి దీపావళి జరుపుకోవడానికి వస్తారు. అంతేకాకుండా, గురునానక్ దేవ్ జీ జయంతి కూడా ఇదే పవిత్రమైన రోజున జరుపుకుంటారు. అందువల్ల ఆధ్యాత్మికంగా కార్తీక పూర్ణిమ ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.
కార్తీక పూర్ణిమను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ బుధవారం నవంబర్ 5న వచ్చింది. కార్తీక పూర్ణిమను ఆధ్యాత్మిక జాగృతి, శ్రద్ధ, భక్తి , కృతజ్ఞతకు ఒక అవకాశంగా భావిస్తారు. కనుక ఈ 5 పనులు చేయకుండా ఉండండి.
కార్తీక పూర్ణిమ నాడు తులసి ఆకులను తెంపవద్దు. హిందూ ధర్మంలో తులసిని దేవి లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. కార్తీక పూర్ణిమ శుభ దినాన తులసి ఆకులను తెంపడం వలన తులసికి అవమానం జరుగుతుంది. ఇది దురదృష్టానికి కారణం కావచ్చు.
కార్తీక పూర్ణిమ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఆచరిస్తారు. మీరు ఉపవాసం చేయకపోయినా ఈ రోజు మాంసాహారం తీసుకోవద్దు... వెల్లుల్లి మరియు ఉల్లి వంటి తమోగుణ ఆహారానికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి ఆధ్యాత్మిక స్వచ్ఛతను భంగపరుస్తాయి
కార్తీక పూర్ణిమ రోజున మీ ఇంటికి వచ్చిన బిచ్చగాడిని ఖాళీ చేతులతో వెనక్కు పంపించవద్దు. మీ శక్తి మేరకు వారికి ఆహారం, పండ్లు, భోజనం మొదలైనవి దానం చేయండి.
కార్తీక పూర్ణిమ రోజు చంద్రుడితో ముడిపడి ఉంటుంది. అందుకే ఈ రోజున ఎవరికీ పాలు, వెండి లేదా తెల్లటి వస్తువులను దానం చేయకూడదు. శాస్త్రాల ప్రకారం ఇది చంద్ర దోషాన్ని పెంచుతుంది.
కార్తీక పూర్ణిమ రోజున ఇంట్లో చీకటిగా ఉంచవద్దు. ఇంటిలోని ప్రతి గదిలోనూ లైట్లు వెలుగుతూ ఉండేలా చూసుకోండి.