✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Tirumala Brahmotsavam Photos: ఘనంగా శ్రీవారి స్న‌ప‌న తిరుమంజ‌నం.. తమిళనాడు నుంచి గోదాదేవిమాలలు

ABP Desam   |  10 Oct 2021 07:17 PM (IST)
1

చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ఆదివారం శ్రీ‌వారి ఆల‌యంలో లవంగాలు, పచ్చకర్పూరం,జొన్నకంకుల మాల‌ల‌తో వేడుక‌గా శ్రీ‌వారికి స్న‌ప‌న తిరుమంజ‌నం చేశారు.

2

లవంగాలు, పచ్చకర్పూరం, జొన్నకంకులు, యాలకులు, ముత్యాలు, తులసి విత్తనాలు, పసుపు పవిత్రాలు, తామరపూల మాల‌ల‌తో ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌లు, కిరీటాల‌తో స్న‌ప‌న తిరుమంజ‌నం వైభవంగా జ‌రిగింది.

3

రంగ‌నాయ‌కుల మండ‌పంలో ప్ర‌త్యేక వేదిక‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులు కాగా.. వేద మంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ వాసుదేవ భ‌ట్టాచార్యులు ఈ వేడుకను ఘనంగా నిర్వ‌హించారు.

4

స్న‌ప‌న తిరుమంజ‌నంలో పలు ర‌కాల మాల‌ల‌తో శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు భ‌క్తుల‌ను అనుగ్రహించారు.

5

వేద పండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠించారు. అర్చ‌కులు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం లాంటి ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.

6

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవలో శ్రీవారిని తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుండి తీసుకొచ్చిన గోదాదేవిమాలలతో అలంకరించారు. తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ పెద్దజీయ‌ర్‌ మఠానికి మాలలను తీసుకురాగా శ్రీశ్రీవ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

7

తిరుపూర్‌కు చెందిన రాజేందర్ స‌హ‌కారంతో శ్రీవారికి, అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక మాల‌లు, కిరీటాలు ఏర్పాటు చేశామని టీటీడీ ఉద్యానవ‌న విభాగం డిప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు వెల్లడించారు.

8

ఈ వేడుకలో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, టీటీడీ ఈఓ కెఎస్‌ జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి దంపతులు, తదితరులు పాల్గొన్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Tirumala Brahmotsavam Photos: ఘనంగా శ్రీవారి స్న‌ప‌న తిరుమంజ‌నం.. తమిళనాడు నుంచి గోదాదేవిమాలలు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.