Bhagavad Gita :మిమ్మల్ని ఆవహించిన భ్రమ, మోహం, మాయ నుంచి బయటపడండి ! గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే!
ఒక భ్రమ వల మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆవరించి ఉంటుంది. ఈ ప్రపంచంతో సమతుల్యతను కొనసాగిస్తూ, స్పష్టత ,ఆచరణాత్మకతతో మనం ఎలా నడవాలి. ఎలా ఒక వ్యక్తి భ్రమ నుంచి బయటపడి వాస్తవిక రూపంలో జీవించగలడు. దీనితో ఎలా సమన్వయం చేసుకోవాలో గీత మనకు నేర్పుతుంది.
గీతను ఏ దృష్టితో చూసినా, ఆ ప్రకారం గీత మనకు ఉపదేశం ఇస్తుంది. ఇక్కడ మనిషి మోహ-మాయ నుంచి పైకి లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. గీత ఉపదేశాలను జీవితంలోకి తీసుకురావడం ద్వారా జీవితం సంతోషంగా మారుతుంది. మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉండదు. గీతలో, భగవాన్ కృష్ణుడు మాయ స్వరూపాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వ్యక్తి జీవితంలో కష్టతరమైన పరిస్థితుల్లో కూడా స్థిరంగా ఉండటానికి సహాయపడుతుందని వివరిస్తాడు.
ఆసక్తి మనస్సును బలహీనపరుస్తుంది ఆసక్తితో వ్యక్తి మనస్సులో భయం కోపం భ్రమ కలుగుతాయి ఒకవేళ మనిషి ఈ భ్రమను వదిలివేస్తే జీవితం బాగుపడుతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఎవరిపైనైనా ఆసక్తి మనల్ని బలహీనపరుస్తుంది ..అందుకే చెప్పాడు.. అర్జునా ఫలం కోరుకోకుండా సమభావంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం నేర్చుకున్నవాడే నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుతాడు
ఆసక్తిని త్యజించడమంటే ప్రపంచానికి దూరంగా ఉండటం కాదని, ధర్మం కోసం మన కర్తవ్యాలను నెరవేర్చాలని బోధిస్తుంది. శ్రీకృష్ణుడు దీని అర్థం మనస్సు లోపల ప్రశాంతంగా ఉండాలి .. పనిని శ్రద్ధతో చేయాలి అని చెప్పారు. గీత మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని వచ్చిన ఫలితాలను స్వీకరించాలని బోధిస్తుంది.
కర్మ చేసేటప్పుడు ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుందని..ఎవరైతే తమ కర్తవ్యాన్ని నిజాయితీగా , అంకితభావంతో నెరవేర్చినప్పుడే అంతర్గత శాంతి లభిస్తుంది. ప్రపంచంలో ప్రతిదీ మార్పుకు లోనవుతుంది. ఈ జ్ఞానం మనస్సును అనవసరమైన ఒత్తిడి నుంచి విముక్తి చేస్తుంది. అప్పుడు మనిషి సహజంగానే తన జీవితంతో సమతుల్యతను ఏర్పరుచుకుంటాడు.
గీత మనకు ప్రతిరోజు ప్రకృతి నియమాలను, ధర్మాన్ని అనుసరించి పనులు చేయాలని నేర్పిస్తుంది. మన కర్తవ్యాన్ని నిజాయితీగా, విశ్వాసంతో పూర్తి చేయాలి. ఇతరులకు బాధ కలిగించని విధంగా కర్తవ్యం నెరవేర్చాలి. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ప్రార్థనతో జీవితాన్ని ప్రారంభించాలి.