Kargil Vijay Diwas 2025: కార్గిల్ యుద్ధంలో బోఫోర్స్ తుపాకీతో రోజుకు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిగాయి?
Kargil Vijay Diwas: కార్గిల్ యుద్ధంలో సైనికులందరూ ధైర్యసాహసాలు ప్రదర్శించారు, ఎందుకంటే ఆ సమయంలో ఈ యుద్ధం దాదాపు 17,000 అడుగుల ఎత్తులో, -10 నుంచి -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో జరిగింది. ఇక్కడి శిఖరాలకు చేరుకోవడానికి సైనికులు చాలా కష్టపడాల్సి వచ్చింది.
Kargil Vijay Diwas: సైనికులు ఎక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఆక్సిజన్ కొరతను కూడా ఎదుర్కొన్నారు. ఈ యుద్ధంలో సైనికుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. కానీ శత్రువు చాలా ఎత్తులో కూర్చున్నాడు , మన సైనికులు దిగువన ఉన్నారు.
Kargil Vijay Diwas: అలాంటి సమయంలో సైనికులకు శత్రువులను కచ్చితంగా లక్ష్యంగా చేసుకునే ఒక ఆయుధం అవసరం. అప్పుడే బోఫోర్స్ తుపాకీ ఉపయోగపడింది. ఈ తుపాకీని ట్రక్కులు, హెలికాప్టర్ల ద్వారా ఎత్తుకు తీసుకెళ్లారు.
Kargil Vijay Diwas: ఆ తర్వాత బోఫోర్స్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు, పాకిస్తాన్ సైన్యం పారిపోయింది. బోఫోర్స్ ఒక ఫిరంగి, ఇది శత్రువులపై కచ్చితమైన గురితో దాడి చేసింది. అప్పట్లో దీన్ని స్వీడన్ నుంచి కొనుగోలు చేశారు.
Kargil Vijay Diwas: ఇది 155 MM తుపాకీ, ఇది దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు కచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించగలదు. బోఫోర్స్ను మొదటిసారిగా కార్గిల్ యుద్ధంలో ఉపయోగించారు, ఇది శత్రువులను చిత్తు చిత్తు చేసింది.
Kargil Vijay Diwas: ఆ సమయంలో ఆర్మీ బోఫోర్స్ తుపాకుల 4 రెజిమెంట్లు అంటే 72 తుపాకులు మోహరించింది, అవి పగలు, రాత్రి కాల్పులు జరిపి భారతదేశ భూభాగం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాయి.
Kargil Vijay Diwas: బోఫోర్స్ 90 డిగ్రీల వరకు 35 కిలోమీటర్ల దూరం వరకు కాల్పులు జరిపింది. ప్రతి 12 సెకన్లకు మూడు రౌండ్లు కాల్చేది. 155 mm తుపాకీ మొత్తం 69 వేల 800 రౌండ్లు కాల్చింది. ప్రతి రోజు దాదాపు 5000 ఫిరంగి గుండ్లు మోర్టార్ బాంబులు రాకెట్లు ఫైర్ చేసింది.