✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ramlala Pran Pratishtha: ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, దర్శనం ఇచ్చిన అయోధ్య రాముడు

Ram Manohar   |  22 Jan 2024 01:33 PM (IST)
1

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ క్రతువు వైభవంగా ముగిసింది. నిర్ణయించిన ముహూర్తానికే ఈ తంతు పూర్తి చేశారు. ఆ తరవాత బాల రాముడు తొలి దర్శనమిచ్చాడు. మోదీ తొలి హారతి ఇచ్చారు.

2

వేద మంత్రోఛ్చారణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రతువు నిర్వహించారు. ఆ తరవాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

3

ముందుగా నిర్ణయించినట్టుగానే మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. 12:30:32 గంటలకి ముగిసింది.

4

ప్రధాని నరేంద్ర మోదీ, యోగి ఆదిత్యనాథ్‌, మోహన్‌ భగవత్‌తో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ తంతు ముగిసిన వెంటనే అయోధ్య బాల రాముడి రూపాన్ని అందరి ముందుంచారు.

5

అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ముగిశాక భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్ర మోదీ తొలి హారతి ఇచ్చారు. ఆ తరవాత రాముల వారికి సాష్టాంగ నమస్కారం చేశారు.

6

12 గంటల ప్రాంతంలో అయోధ్య ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామయ్య కోసం పట్టు వస్త్రాలు, వెండి గొడుగు తీసుకొచ్చారు. ఇంత గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

7

ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో చుట్టూ ఉన్న వాళ్లంతా సందడి చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంగణమంతా మారుమోగింది. అటు అయోధ్య అంతా రాముడి నినాదాలతో దద్దరిల్లింది.

8

ప్రధాని మోదీ ఆలయంలోకి అడుగు పెడుతున్న సమయంలో చుట్టూ ఉన్న సాధువులు, సంతువులు భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న వేళ ఉద్విగ్నంగా ఎదురు చూశారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • న్యూస్
  • Ramlala Pran Pratishtha: ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ, దర్శనం ఇచ్చిన అయోధ్య రాముడు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.