✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనమిచ్చాడు చూశారా - ఎంత చూసినా తనివి తీరదు

Ram Manohar   |  19 Jan 2024 05:33 PM (IST)
1

జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ రోజున దర్శనమివ్వాల్సిన అయోధ్య రాముడు ముందే దర్శనమిచ్చాడు. ఇప్పటి వరకూ ముఖాన్ని కప్పేసి ఉన్న విగ్రహం ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు బాల రాముడి పూర్తి రూపం కనిపించాక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

2

పూర్తిగా కృష్ణ శిలతో తయారు చేసిన బాల రాముడి విగ్రహం చూపు తిప్పుకోనివ్వడం లేదు. చిరు నవ్వులు చిందిస్తున్న ఈ విగ్రహం అందరినీ కట్టి పడేస్తోంది.

3

బంగారు విల్లు, బాణం పట్టుకున్న ఐదేళ్ల రాముడి విగ్రహాన్ని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ తయారు చేశాడు. ఈ విగ్రహం ఎత్తు 5 అడుగులు.

4

ఇప్పటికే బాల రాముడి విగ్రహం గర్భ గుడిలోకి చేరుకుంది. గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

5

జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విగ్రహాని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కేవలం కొంత మంది అతిథులకే ఆ రోజు ఆలయంలోకి అనుమతి ఉంటుందని ట్రస్ట్ వెల్లడించింది.

6

గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు అంతా జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరగాల్సిన క్రతువులు కొనసాగుతున్నాయి.

7

అయోధ్య ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్ ఆలయాన్ని సందర్శించారు. పనులపై ఆరా తీశారు. మొత్తం 8 వేల మంది అతిథులకు ఆహ్వానం పంపారు. వీళ్లలో బిలియనీర్ ముకేశ్ అంబానీ, బాలీవుడ్‌ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్‌ ఉన్నారు.

8

ఈ ఉత్సవానికి హాజరయ్యే అతిథులు ఇన్విటేషన్ కార్డుతో పాటు తప్పనిసరిగా విజిటింగ్ పాస్‌ని తీసుకురావాలని ట్రస్ట్ వెల్లడించింది. దానిపై ఉన్న QR కోడ్‌ని స్కాన్‌ చేస్తేనే లోపలికి అనుమతినిస్తారని స్పష్టం చేసింది. కేవలం ఇన్విటేషన్ కార్డు మాత్రమే సరిపోదని వివరించింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • న్యూస్
  • Ram Mandir: అయోధ్య రామయ్య దర్శనమిచ్చాడు చూశారా - ఎంత చూసినా తనివి తీరదు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.