Maha Shivaratri Fasting Rules : మహాశివరాత్రి 2026 ఉపవాసం ఎవరు చేయకూడదు? ఎవరు చేయవచ్చు? నియమాలు ఇవే
మహాశివరాత్రి వ్రతం పరమశివుని ఆరాధనకు సంబంధించిన అత్యంత పవిత్రమైన పండుగ. ఈ రోజున శివభక్తులు ఉపవాసం ఉండి శివ పూజ, రుద్రాభిషేకం, రాత్రి జాగరణ చేస్తారు. మహాశివరాత్రి వ్రతం చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయి. జీవితంలో సుఖసంతోషాలు వస్తాయి.
కానీ ఉపవాసం చేయడానికి ముందు దాని నియమాలను బాగా తెలుసుకోవాలి. మహాశివరాత్రి వ్రతం కూడా అందరికీ ఉండదు. కాబట్టి మహాశివరాత్రి వ్రతం ఎవరు చేయకూడదో? ఎవరు చేయవచ్చో ముందుగానే తెలుసుకుందాం.
గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పోషకాహారం ఎక్కువ అవసరం. అటువంటి మహిళలు కఠినమైన ఉపవాసాలకు దూరంగా ఉండాలి. ఉపవాసం చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి. లేదా కఠినమైన ఉపవాసాలకు బదులుగా పండ్లు లేదా ఉప్పు లేని ఆహారం తీసుకోండి.
డయాబెటిస్, రక్తపోటు, గుండె, కిడ్నీ లేదా ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉన్నవారు ఉపవాసం ఉండకూడదు. మీరు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాసం చేస్తే.. ముందుగా వైద్యుడి సలహా తీసుకోవాలి. వృద్ధులు కూడా ఉపవాసం చేయకూడదు.
మహిళలు ఋతుస్రావం సమయంలో మహాశివరాత్రి పూజ చేయకూడదు. కానీ మీరు వ్రతం చేయవచ్చు. అలాగే శివలింగాన్ని తాకకుండా మానసిక జపం కూడా చేయవచ్చు.
శాస్త్రాలలో చెప్పబడింది ఏమిటంటే.. ఒకవేళ విపత్కర పరిస్థితి లేదా ఆరోగ్య కారణాల వల్ల ఎవరైనా వ్రతం చేయలేకపోతే.. వారు కేవలం శివ పూజ, మంత్ర జపం, దానధర్మాలు, సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా కూడా పరమశివుని అనుగ్రహం పొందవచ్చు.