Shobha shetty karthika deepam sequel: కార్తీకదీపం సీక్వెల్లో మోనిత ఉన్నట్టేనా!
స్మాల్ స్క్రీన్ పై శోభాశెట్టికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్తీక దీపం సీరియల్ లో విలన్ మోనితగా ఫుల్ మార్కులు కొట్టేసింది.
కన్నడంలో, తెలుగులో చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపం ద్వారా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇప్పుడు కార్తీకదీపం సీక్వెల్ హడావుడి మొదలవడంతో మళ్లీ మోనిత ఉంటుందా ఉండదా అనే డిస్కషన్ జరుగుతోంది
కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటూ మోనిత క్యారక్టర్ కి బాగా కనెక్టైపోయారు ప్రేక్షకులు. తెలుగు సినిమా చరిత్రలో ‘బాహుబలి’ ఎలాగో.. బుల్లితెరపై కార్తీకదీపం అలా అయిపోయింది.
అలాంటి సీరియల్కి కొనసాగింపుగా ‘కార్తీకదీపం’ పార్ట్ 2 వస్తుందని అఫీషియల్ ప్రోమో వదిలారు. అప్పటి నుంచీ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల్లో మొదలైన ఒకే ఒక్క ప్రశ్న.. మా డాక్టర్ బాబు.. వంటలక్క.. మోనితలు మళ్లీ వస్తారా? లేదా? అని.
‘కార్తీకదీపం’ సీక్వెల్ కథకి సంబంధించిన ప్రోమోలో.. డాక్టర్ బాబు, వంటలక్కల కూతురు శౌర్యతో కథ మొదలుపెట్టించబోతున్నారు. పైగా నాకు అమ్మైనా నాన్నైనా మా అమ్మే అంటోంది శౌర్య.
‘కార్తీకదీపం’ సీక్వెల్ కథకి సంబంధించిన ప్రోమోలో.. డాక్టర్ బాబు, వంటలక్కల కూతురు శౌర్యతో కథ మొదలుపెట్టించబోతున్నారు. పైగా నాకు అమ్మైనా నాన్నైనా మా అమ్మే అంటోంది శౌర్య. దీన్ని బట్టి చూస్తే డాక్టర్ బాబు.. వంటలక్క, శౌర్యలకు దూరమైనట్టు చెప్పకనే చెప్పారు.
ప్రోమోను బట్టి చూస్తే.. శౌర్య తన అమ్మా నాన్నని చేరుకోవడమే స్టోరీ అయి ఉండొచ్చు. ఇందులో మోనిత పాత్ర ఏంటో మరి చూడాలి...
‘కార్తీక దీపం’ సీరియల్లో తనతో పాటు డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డిని పెళ్లి చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఈ మధ్యే ఏంగేజ్ మెంట్ చేసుకుంది.