Brahmamudi Serial,Brahmamudi Today మే 27ఎపిసోడ్: పోలీస్ స్టేషన్ కి అప్పు కళ్యాణ్ - ఫస్ట్ నైట్ రూమ్ లో రాజ్ కావ్య - బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్ హైలెట్స్!
నువ్వే మీ అమ్మకు చెప్పావు కదా అని కళ్యాణ్ ను నిలదీస్తుంది అప్పు. నేనేం చేయలేదని చెబుతాడు కళ్యాణ్. ఏం చేస్తావో తెలియదు దొంగను పట్టుకున్నా ఈ రోజు నాకు నైట్ డ్యూటీ వేశారు వెళ్లాల్సిందే అంటుంది అప్పు. అప్పుడే వచ్చిన ధాన్యలక్ష్మి ఈ రోజు తప్పించుకోవడం నీకు సాధ్యం కాదంటుంది.
స్వప్నతో బ్యాంక్ నుంచి ఏడువారాల నగలు తీసుకొచ్చి మీ చెల్లెలుకి అలంకరించు అని చెప్తాడు రాహుల్. నీ మాట వింటానులే ఈ రోజు అంటుంది స్వప్న
వెంటనే వేరే అమ్మాయికి కాల్ చేసి..బంగారం తీసుకొస్తా బంగారం రెడీగా ఉండు అంటాడు. ఆ వెనుకే ఉంటుంది స్వప్న. వినేసిందేమో అని షాక్ అవుతాడు. బ్యాంక్ కి వెళదామా అని అడుగుతుంది
కావ్య దగ్గరకు వెళ్లిన రాజ్..ఫస్ట్ నైటే ఏర్పాట్లపై హడావుడి చేస్తుంటాడు. వందకేజీల పూలు, వందల పండ్లు అని పెద్ద లిస్ట్ చెప్తాడు. కళావతి సెటైర్స్ వేస్తుంది
ఇద్దరూ గొడవపడుతుంటే అప్పుడే వస్తారు అపర్ణ, ఇందిరాదేవి. వాడిమాట విను అని కావ్యతో చెబుతారు. ఈరోజు రాత్రికి కావ్యను పడేస్తానని చెప్తాడు రాజ్.
పోలీస్ స్టేషన్లో ఉన్న దొంగ చార్లెస్ తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తాడు. టీ బాయ్ తో మాట్లాడి కానిస్టేబుల్స్ అందరకీ మత్తు మందు కలిపిన టీ ఇప్పిస్తాడు
ఈ నగలు ఈ హడావుడి ఎందుకుం అంటుంది అప్పు. బయటకు ఇలా మాట్లాడుతావ్ కానీ నవ్వు కళ్యాణ్ కి కన్నుకొట్టి వెళ్లడం చూశాను అంటూ ఆటపట్టిస్తుంది. నాకూ దొరికాడు ఓ మొగుడు అంటూ రాహుల్ గురించి చెప్తుంటే అప్పుడే వస్తాడు. నగలన్నీ వేసుకోవాల్సిందే అని స్వప్న అంటే రాహుల్ సపోర్ట్ చేస్తాడు. ఇప్పటికీ వీడిపై నాకు అనుమానంగా ఉందంటుంది స్వప్న. స్వీట్స్ తెద్దాం అని చెప్పి స్వప్నను తీసుకెళ్తాడు
చార్లెస్ తప్పించుకున్నాడని అప్పుకి కాల్ వస్తుంది. అదే విషయం కళ్యాణ్ కి చెబుతుంది. మా అన్నయ్యే కాపాడాలి అంటాడు కళ్యాణ్.
రాజ్ కావ్య ఫస్ట్ నైట్ రూమ్ డెకరేట్ చేస్తారు. నేను వద్దన్నా కానీ ఇన్ని ఆర్డర్ చేశారంటూ రాజ్ పై ఫైర్ అవుతుంది కావ్య
బ్రహ్మముడి మే 28 ఎపిసోడ్ లో అప్పు-కళ్యాణ్ వెళ్లిపోతే ఆ రూమ్ లో కూర్చుంటారు కావ్య-రాజ్..డౌట్ వచ్చి డోర్ బయట నిల్చుని ఉంటుంది ధాన్యం..