Biggest OTT Films Offer : ఎన్ని కోట్లయినా.. తగ్గేదేలే..!
గతేడాది కరోనా కారణంగా థియేటర్లను మూసేశారు. ఆ సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఎంతగా అంటే.. అప్పటివరకు చిన్న సినిమాలు మాత్రమే విడుదలయ్యే ఓటీటీల్లోకి పెద్ద పెద్ద సినిమాలు కూడా వచ్చేశాయి. థియేటర్లు విడుదలవుతాయని ఎదురుచూసిన చాలా మంది దర్శకనిర్మాతలు చేసేదేం లేక తమ సినిమాలను భారీ రేట్లకు ఓటీటీలకు అమ్మేశారు. ఈ మధ్యకాలంలో ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడై, నేరుగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వాటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాధె : సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాను ప్రభుదేవా తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు వరకు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. దీంతో బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. ప్రముఖ జీ సంస్థ ఈ సినిమా హక్కులను రూ.250 కోట్లకు సొంతం చేసుకున్నారు. కానీ ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.
లక్ష్మీ : సౌత్ లో వచ్చిన 'కాంచన' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమాను ఒరిజినల్ డైరెక్టర్ లారెన్స్ తెరకెక్కించారు. ఈ సినిమాను హాట్ స్టార్ సంస్థ రూ.125 కోట్లు పెట్టి రైట్స్ దక్కించుకుంది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
జగమే తంత్రం : ధనుష్ నటించిన ఈ సినిమాపై హైప్ మాములుగా రాలేదు. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.60 కోట్లు పెట్టి సినిమాను కొనుక్కుంది. కానీ సినిమా ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
సడక్ 2 : ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వచ్చిన డిజాస్టర్ సినిమాల్లో 'సడక్ 2' ఒకటి. ఈ సినిమా రైట్స్ కోసం హాట్ స్టార్ సంస్థ రూ.70 కోట్లు చెల్లించింది.
గులాబో సితాబో : అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ఈ సినిమా గతేడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ రూ.65 కోట్లు ఖర్చు పెట్టింది.
భుజ్ : అజయ్ దేవగన్, సంజయ్ దత్ లాంటి స్టార్లు నటిస్తోన్న ఈ సినిమా హక్కులను హాట్ స్టార్ సంస్థకు రూ.110 కోట్లకు అమ్మేశారు. ఈ ఏడాది ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.