Jagan In Investers Meet: పెట్టుబడులకు ఏపీ బెస్ట్ ప్లేస్ - ఇన్వెస్టర్లకు సీఎం జగన్ ఆహ్వానం

ఇన్వెస్టర్లకు సీఎం జగన్ ఆహ్వానం (Photo Credit: Twitter/@AndhraPradeshCM )
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన
ఇంటర్నేషనల్ డిప్లమాట్ అలియన్స్ మీట్ కు హజరైన విదేశీ ప్రతినిదులు
విదేశీ ప్రతినిదులతో ఏపీ సీఎం జగన్ గ్రూప్ డిస్కషన్
విదేశీ ప్రతినిధులను పరిచయం చేసుకొని ఏపీలో అవకాశాలు వివరించిన జగన్
11.43 శాతం జీఎస్డీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందినట్లు వెల్లడి
సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాల అధికారులు, కంపెనీల ప్రతినిధులు
ఏపీ సీఎం జగన్ తో పాటుగా మంత్రులు బుగ్గన, అమర్నాథ్
మార్చి 3, 4న విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోందని, అందరూ రావాలని ఆహ్వానించారు.
ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టేందుకు మీ సహకారం కావాలని వ్యాపారవేత్తలను జగన్ ను కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని చెప్పారు.
దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి చాలా ప్రత్యేకతలున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్టర్లకు వివరించారు.
ఏపీ వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ వన్గా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పెట్టుబడిదారులకు వివరించారు.
పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే టాప్ ప్లేసులో ఉన్నామని జగన్ చెప్పారు.
ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ వేదికగా సమావేశం
ఇప్పటికే ఆరు పోర్టులున్నాయని జగన్ వారికి తెలిపారు. మరో నాలుగు త్వరలో మొదలుపెడతామన్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు ప్రారంభించబోతున్నట్లు జగన్ వెల్లడించారు.