YSRCP Latest News: ఏపీ ఎన్నికల కోసం నియోజకవర్గ ఇంఛార్జిలను మారుస్తున్న వైఎస్ఆర్ సీపీ.. తాజాగా మూడో జాబితా విడుదల చేసింది. ఈసారి 23 మందికి ఈ జాబితాలో చోటు లభించింది. మొదటి జాబితా 11 మందితో విడుదల చేయగా.. రెండో జాబితాలో 27 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా 21చోట్ల అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసు సమీపంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల  రామకృష్ణారెడ్డితో కలిసి మూడో జాబితాలోని పేర్లను ప్రకటించారు.


ఎంపీ అభ్యర్థులు
విశాఖపట్నం ఎంపీ - బొత్స ఝాన్సి
విజయవాడ - కేశినేని నాని
శ్రీకాకుళం - పేరాడ తిలక్
కర్నూల్‌ ఎంపీ - గుమ్మనూరి జయరాం
తిరుపతి ఎంపీ - కోనేటి ఆదిమూలం
ఏలూరు - కారుమూరి సునీల్ కుమార్ యాదవ్


ఎమ్మెల్యే అభ్యర్థులు
ఇచ్ఛాపురం - పిరియ విజయ
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి (ఎస్సీ) - కంభం విజయరాజు
రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి
దర్శి - బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
పూతలపట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
చిత్తూరు - విజయానంద రెడ్డి
మదనపల్లె - నిస్సార్ అహ్మద్
రాజంపేట - ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
ఆలూరు - బూసినే విరూపాక్షి
కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
గూడూరు (ఎస్సీ) - మేరిగ మురళి
సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
పెనమలూరు - జోగి రమేశ్
పెడన - ఉప్పాల రాము


శ్రీకాకుళం జడ్పీ ఛైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్ఛాపురం జడ్పీటీసీగా ఈమె పని చేస్తున్నారు.