Sharmila party: వైయస్ వారసులం మేమే.. 100 రోజుల్లో పాదయాత్ర చేస్తా: షర్మిల
తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. రాజన్న సంక్షేమ పాలన తీసుకురావడమే ధ్యేయమంటూ రంగప్రవేశం చేసిన దివంగత రాజశేఖర్రెడ్డి తనయ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చారు.
ABP Desam Last Updated: 08 Jul 2021 08:30 PM
Background
తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో జెండా, అజెండాను వెల్లడించనున్నారు. ఇవాళ ఉదయం వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో...More
తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సర్వం సిద్ధమైంది. కాసేపట్లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో జెండా, అజెండాను వెల్లడించనున్నారు. ఇవాళ ఉదయం వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణలో తన రాజకీయ ప్రస్థానానికి తన తల్లి విజయమ్మ నుంచి ఆశీర్వాదం లభించిందని ట్వీట్ చేశారు.ఘన స్వాగతం.. కొద్దిసేపటి క్రితమే షర్మిల ఇడుపులపాయ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. షర్మిలకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం ప్రాంగణమంతా షర్మిల పార్టీ కార్యకర్తలు అభిమానులతో కోలాహలంగా మారింది. షర్మిల పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడే పార్టీ జెండా, అజెండా ప్రకటిస్తారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
వైఎస్ఆర్ వారసులం మేమే..
" ‘‘కృష్ణానదిపై రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్కు ఇప్పుడే తెలివొచ్చిందా?. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించి భోజనాలు పెట్టొచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించొచ్చు. కానీ, రెండు నిమిషాలు కూర్చుని సమస్యను పరిష్కరించుకోలేరా?. మరోసారి కూర్చుని నీటి సమస్యపై ఎందుకు చర్చించరు. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం చూస్తూ కూర్చుంది. సమస్యను పరిష్కరించుకోవాలనే చిత్తశుద్ధి ఎవరిలోనూ లేదు. న్యాయబద్దంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిబొట్టునూ వదులుకోం. ఇతర ప్రాంతానికి చెందిన నీటి చుక్కను కూడా మేం తీసుకోం. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నదే మా సిద్ధాంతం. ఎంతోమంది నేతలకు వైఎస్ఆర్ రాజకీయ భిక్షపెట్టారు. వైఎస్ఆర్ను తిడుతుంటే ఈ కాంగ్రెస్ నేతలు చప్పుడు చేయటం లేదు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పేరు ఉచ్ఛరించే అర్హత లేదు. వైఎస్ఆర్ అసలైన వారుసులం మేమే. నేటి నుంచి 100 రోజుల తర్వాత పాదయాత్ర చేస్తా’’ "
- - వైయస్ షర్మిల
- వైయస్ షర్మిల