Iran is not surrendering even after killing of 15 top leaders: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ  ఇరాన్  ఊహించని రీతిలో వ్యవహరిస్తోంది. గత కొద్ది కాలంగా జరిగిన దాడుల్లో ఇరాన్ పరమ పవిత్రంగా భావించే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ,  ఆర్మీ చీఫ్, ఇంటెలిజెన్స్ హెడ్ , ఐఆర్‌జీసీ  ప్రతినిధి సహా దాదాపు  15 మంది అగ్రశ్రేణి నాయకులు హతమయ్యారు. సాధారణంగా ఏ దేశంలోనైనా ఇంతటి కీలక నాయకత్వం తుడిచిపెట్టుకుపోతే ఆ వ్యవస్థ కుప్పకూలుతుంది. కానీ, ఇరాన్ మాత్రం పట్టువదలకుండా ప్రతిఘటిస్తోంది. దీనికి కారణం ఆ దేశం దశాబ్దాలుగా నిర్మించుకున్న  మొజాయిక్ డిఫెన్స్ అనే వికేంద్రీకృత యుద్ధ సిద్ధాంతం.

Continues below advertisement

ఇరాన్ సైనిక వ్యవస్థ ఏ ఒక్క నాయకుడి మీదో లేదా సెంట్రల్ కమాండ్ మీదో ఆధారపడి లేదు. అగ్రనేతలు లేకపోయినా, క్షేత్రస్థాయిలోని చిన్న చిన్న సైనిక విభాగాలు స్వయంగా నిర్ణయాలు తీసుకుని దాడులు చేయగలవు. గ్రీకు పురాణాల్లోని  హైడ్రా  అనే రాక్షసికి ఒక తల నరికితే మరో రెండు ఎలా పుట్టుకొస్తాయో, ఇరాన్ కమాండ్ స్ట్రక్చర్ కూడా అలాగే రూపొందించబడింది. ఒక నాయకుడు చనిపోగానే, తదుపరి బాధ్యతలు తీసుకునేలా రెడీ-టు-గో నాయకత్వాన్ని వారు సిద్ధం చేసుకున్నారు. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు  ముజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడం ఈ వ్యూహంలో భాగమే.

 ఈ యుద్ధం అమెరికా ఆర్థిక  రూ. 92,000 కోట్లకు పైగా పైగా ఖర్చు చేసినట్లు అంచనా. ఇరాన్ ప్రయోగించే చౌకైన డ్రోన్లను కూల్చడానికి అమెరికా ఖరీదైన క్షిపణులను వాడాల్సి రావడం, గల్ఫ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించడం ఈ ఖర్చును భారీగా పెంచేసింది. ఆధునిక సాంకేతికత ఉన్నప్పటికీ, యుద్ధ క్షేత్రంలో తలెత్తుతున్న అనూహ్య సవాళ్లు పెంటగాన్‌ను కలవరపెడుతున్నాయి.

Continues below advertisement

గాలిలో ఆధిపత్యం కోసం జరిగిన పోరులో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వేర్వేరు దాడుల్లో ఇప్పటివరకు సుమారు 16 యుద్ధ విమానాలు/డ్రోన్లను  అమెరికా కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. కువైట్,  ఇరాక్ సరిహద్దుల్లో ఎఫ్-15 రకానికి చెందిన విమానాలను ఇరాన్ క్షిపణులు కూల్చివేయడం అంతర్జాతీయ రక్షణ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఇరాన్ తన వద్ద ఉన్న భారీ క్షిపణి సంపత్తిని ఉపయోగించి అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది.

ఇరాన్ బలం కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. లెబనాన్‌లోని హెజ్బొల్లా, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్ , సిరియాలోని ప్రాక్సీ గ్రూపులు ఇప్పుడు ఏకకాలంలో దాడులు చేస్తున్నాయి. తన నాయకత్వం దెబ్బతిన్న ప్రతిసారీ, ఇరాన్ తన ప్రాక్సీ నెట్‌వర్క్‌ను మరింత ఉధృతం చేస్తోంది. ఇజ్రాయెల్ మరియు, అమెరికా స్థావరాలే లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులు యుద్ధాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి.

 ఇరాన్‌ను కేవలం నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా జయించలేమని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి. భారీ ఆర్థిక నష్టం, విమానాల విధ్వంసం అమెరికా వ్యూహకర్తలను పునరాలోచనలో పడేశాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో పాటు, మధ్యప్రాచ్యం మరో పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.