US warning to Pakistan General Asim Munir : పాకిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, అతిగా అధికార ప్రయోగం, ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో పెట్టడం,  2024 ఎన్నికల్లో హింస,  అమెరికాలోని పౌరులపై  దాడులు  వంటి ఆరోపణలతో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్,  ప్రభుత్వ అధికారులపై అమెరికా కఠిన చర్యలు తీసుకుంటోంది. 44 మంది బైపార్టిసన్ US కాంగ్రెస్ సభ్యులు, ప్రమిలా జయపాల్, గ్రెగ్ కాసార్ నేతృత్వంలో డిసెంబర్ 3న రాష్ట్ర కార్యదర్శి మార్కో రూబియోకు లేఖ రాశారు. గ్లోబల్ మాగ్నిట్స్కీ చట్టం ప్రకారం వీసా నిషేధాలు,  ఆస్తి జప్తుచేయడం, ఆర్థిక ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.  ఈ చర్యలు US-పాక్ సంబంధాల్లో  ఉద్రిక్తతకు దారితీస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.                         

Continues below advertisement

డెమొక్రటిక్ కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమిలా జయపాల్, రిపబ్లికన్ గ్రెగ్ కాసార్ నేతృత్వంలో 44 మంది సభ్యుల లేఖలో మునీర్, ఇతర పాకిస్తాన్  అధికారులు  US పౌరులు, రెసిడెంట్లు పాక్ మిలిటరీని విమర్శిస్తే వారి కుటుంబాలపై దాడులు  చేస్తున్నారని ఆరోపించారు.  US పౌరులపై మునీర్ ప్రభావిత దాడులకు అమెరికా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు.  ఇటీవలి US-పాక్ సమావేశాలు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తాయని ప్రశ్నించారు.  ఇమ్రాన్ ఖాన్ వంటి రాజకీయ ఖైదీల విడుదలకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. పై ఏమి చేస్తారు?  అని ప్రభుత్వాన్ని నిలదీశారు.                  

 పాకిస్తాన్‌లో అధికార దుర్వినియోగం పెరుగుతోంది. విపక్ష నాయకులు, జర్నలిస్టులు, సామాన్య పౌరులను టార్గెట్ చేస్తున్నారు.  ఈ హెచ్చరిక మార్చి 2025లో ప్రవేశపెట్టిన  పాకిస్తాన్ డెమాక్రసీ యాక్ట్ కు కొనసాగింపుగా వచ్చింది.  ఆ బిల్లులో మునీర్‌ను  రాజకీయ వ్యతిరేకులపై తప్పుడు కేసులు, శిక్షలకు బాధ్యులుగా చేర్చారు.  180 రోజుల్లో ఆంక్షలు విధించాలని కోరారు. ఇమ్రాన్ ఖాన్  ఆగస్ట్ 2023 నుంచి జైలులో  పొలిటికల్ ప్రిజనర్ ఉన్నారని ఆయనను విడుదల చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది.                 

Continues below advertisement

పాక్ లో అమెరికన్లపై దాడులు పెరుగుతున్నాయి. అమెరికా జాతీయుడైన  జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ కుటుంబాన్ని అపహరించారు. మిలటరీలో అవినీతి గురించి నూరాని కథనాలు రాశారు.  అలాగే పాక్-అమెరికన్ మ్యూజిషియన్ సల్మాన్ అహ్మద్ బంధువులను కూడా కిడ్నాప్ చేశారు.  FBI జోక్యం తర్వాత విడుదల చేశారు. అలాగే బలూచిస్తాన్ సహా పలు చోట్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు పాక్ సైన్యమే కారణమని ఆరోపణలు ఉన్నాయి. 

అయితే పాక్ ప్రభుత్వం, మిలిటరీ ఈ లేఖను పాక్ సార్వభౌమత్వంపై దాడిగా చెబుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ను వదిలి పెట్టేది లేదని అంటున్నారు. ఇమ్రాన్ ను వదిలి పెట్టకపోతే అమెరికా పాక్ పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.