US shutdown is over: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఫండింగ్ బిల్పై సంతకం చేసి, చరిత్రలో అతి దీర్ఘకాలికమైన 43 రోజుల యుఎస్ ప్రభుత్వ షట్డౌన్కు ముగింపు పలికారు. అక్టోబర్ 1 నుంచి జరుగుతున్న ఈ షట్డౌన్ ఫెడరల్ ఉద్యోగులకు ఆర్థిక ఒత్తిడి, విమానాశ్రయాల్లో ప్రయాణికుల ఆలస్యం, ఫుడ్ బ్యాంకుల వద్ద లాంగ్ క్యూలు వంటి సమస్యలు సృష్టించింది. ఈ బిల్ సంతకం కాంగ్రెస్ ద్వారా కొన్ని గంటల ముందే అప్రూవ్ అయిన తర్వాత జరిగింది.
ఓవల్ ఆఫీస్లో జరిగిన సంతకం కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. రిపబ్లికన్ ఆధ్వర్యంలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 222-209 ఓటులతో ఈ బిల్ను ఆమోదించింది. ట్రంప్ సంతకం తర్వాత షట్డౌన్ వల్ల ఆగిపోయిన ఫెడరల్ ఉద్యోగులు గురువారం నుంచి విధులకు హాజరు కావొచ్చు. ఈ బిల్ జనవరి 30 వరకు ఫండింగ్ను పొడిగించి, $38 ట్రిలియన్ డెబిట్కు సంవత్సరానికి $1.8 ట్రిలియన్లు జోడించే మార్గాన్ని ఫెడరల్ ప్రభుత్వానికి అందిస్తుంది. షట్డౌన్ ప్రారంభమైన అక్టోబర్ 1 నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ఫెడరల్ వర్కర్ల ఫైరింగ్లను రివర్స్ చేస్తుంది.
ఈ బిల్ ఫెడరల్ ఉద్యోగులకు మరిన్ని లేఆఫ్ల నుంచి రక్షణ అందిస్తుంది. షట్డౌన్ ముగిసిన తర్వాత వారికి జీతాలు చెల్లింపు హామీ ఇస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు సంబంధించిన బిల్, ముఖ్య ఫుడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్లపై ఆధారపడే ప్రజలకు బడ్జెట్ సంవత్సరం మిగిలిన కాలం వరకు ఫండింగ్ ఆగిపోకుండా చూస్తుంది. ఈ షట్డౌన్, వాల్ ఫండింగ్, ఇమ్మిగ్రేషన్ విషయాలపై డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల మధ్య ఘర్షణల వల్ల జరిగింది. ట్రంప్ ఈ బిల్ను సంతకం చేయడం ద్వారా తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ దీర్ఘకాలిక సమస్యలు ఇంకా పరిష్కారం కానవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
43 రోజులు అమెరికా ప్రభుత్వ షట్డౌన్ చరిత్రలో అతి దీర్ఘకాలికమైనదిగా నిలిచింది. ఈ షట్డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగింది. ఈ షట్డౌన్, డెమోక్రటిక్ మరియు రిపబ్లికన్ పార్టీల మధ్య వాల్ ఫండింగ్, ఇమ్మిగ్రేషన్ విషయాలపై ఘర్షణల వల్ల జరిగింది. 800,000 మంది ఫెడరల్ ఉద్యోగులు తాత్కలికంగా విధులు రాలేకపోయారు. మరో 4 మిలియన్ కాంట్రాక్టర్లు కూడా ప్రభావితమయ్యారు. ఫెడరల్ స్పెండింగ్లో $18 బిలియన్ ఆలస్యం జరిగింది.