US Iran War Latest Updates: అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. నిన్న ఇవాళ ఇరాన్‌లోని పలు నగరాల్లో పేలుళ్లు జరిగింది. ఈ ఘటనలో తమ ఎనిమిది మంది సైనికులు మరణించారని టెహ్రాన్ ప్రకటించింది. ఈలోగా, మరో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేసిందని ఇజ్రాయెల్ అమెరికాకు తెలియజేసింది. ఈ నిఘా సమాచారమే ఇరాన్‌పై అమెరికా మరో దాడికి పాల్పడేలా చేసిందని భావిస్తున్నారు.

Continues below advertisement

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ ఇటీవల ప్రణాళిక వేసిందని వాషింగ్టన్‌తో ఇజ్రాయెల్ నిఘా సమాచారాన్ని పంచుకుందని CNN నివేదించింది . ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ నిఘా సమాచారాన్ని ఉపయోగించి, ట్రంప్‌ను మరో దాడికి రెచ్చగొట్టారు. అమెరికా, ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఈ ఒక్క సమాచారం ఆ రెండు దేశాల మధ్య తిరిగి యుద్ధానికి దారితీసింది. 

అమెరికా ఇజ్రాయెల్ ఉచ్చులో పడిందా?

ఇజ్రాయెల్ నిఘా సమాచారం కచ్చితమైనదో కాదో తెలియదు, కానీ అది ట్రంప్‌ను రెచ్చగొట్టడానికే చేసిన ప్రయత్నమని కొందరు అమెరికా అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ అదే నిజమైనా, ఇజ్రాయెల్ తన ప్రణాళికలో సఫలమైంది. అమెరికా ఇప్పుడు ఇరాన్‌పై తన దాడులను తీవ్రతరం చేసింది.

Continues below advertisement

తన హత్య గురించి ట్రంప్ ఏమన్నారు?

ఇరాన్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఈ వారం ట్రంప్ స్వయంగా సూచించారు. "వారు నన్ను అంతం చేయాలనుకుంటున్నారు. వారి ప్రతీకార జాబితాలోనూ నేను ఉన్నాను," అని నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అంకారాలో ట్రంప్ అన్నారు. "వారి ప్రతీకార జాబితాలోనూ నేను ఉన్నానని ఈరోజే చూశాను, ఇప్పటివరకు నేను కొంచెం అదృష్టవంతుడినే అనుకుంటున్నాను, కానీ అది బహుశా ఎక్కువ కాలం నిలవదు."

ఖమేనీకి అంత్యక్రియలు 

ఇరాన్ సర్వోన్నత నాయకుడు, అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు మషద్‌లో జరిగాయి. వారం రోజుల పాటు జరిగిన అంత్యక్రియలు, సంతాప సభల అనంతరం, మషద్‌లోని ఇమామ్ రెజా మందిర సముదాయం సమీపంలో ఖమేనీని ఖననం చేశారు. ఈ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సంతాప సభలు, అంత్యక్రియల ఊరేగింపులు జరిగాయి.