Eiffel Tower : ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా నిలిచే పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ చరిత్రలో మరో అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. ఈ టవర్ నిర్మించిన కాలం నాటి అసలైన మెట్ల భాగాన్ని వేలం వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 137 ఏళ్ల నాటి ఈ చారిత్రక అవశేషం కేవలం ఇనుప ముక్క మాత్రమే కాదు, అది నాటి ఇంజినీరింగ్ అద్భుతానికి నిలువెత్తు సాక్ష్యం. 

Continues below advertisement

వేలం ఎప్పుడు వేస్తారు?

ప్రముఖ ఫ్రెంచ్ వేలం సంస్థ ఆర్ట్‌క్యురియల్‌, 2026 మే 21న ఈ వేలాన్ని నిర్వహించనుంది. ఈ వేలంలో విక్రయించబోయే మెట్ల భాగం సుమారు8.5 నుంచి 9 అడుగులు ఎత్తు కలిగి ఉంది. ఇందులో మొత్తం 14మెట్లు వృత్తాకారంలో అమర్చారు. ఈ విభాగం టవర్‌ రెండో, మూడో అంతస్తులను కలుపుతూ ఉండే అసలైన మెట్ల మార్గంలో భాగంగా ఉండేది. 

ఎందుకు మెట్లు తొలగించారు?

చారిత్రక విలువ వల్లే కాకుండా దాని నిర్మాణ శైలి వల్ల కూడా ప్రాముఖ్యత పొందుతుంది. రివెటెడ్‌ షీట్ మెటల్ సిలిండర్‌పై అమర్చిన ఈ మెట్లు ఈఫిల్‌ టవర్ అసలైన గోధుమ రంగులో పునరుద్ధరించారు. ఈఫిల్ టవర్ నిర్మించిన సమయంలో పై అంతస్తు చేరుకోవడానికి 1701 మెట్లు ఉండేవి. కాలక్రమేణా పర్యాటకుల సౌకర్యార్థం లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. 1983లో టవర్‌పై అంతస్తులకు చేరుకోవడానికి లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే టవర్ పైభాగంలో ఉన్న హెలికల్ మెట్ల మార్గాన్ని తొలగించాల్సి వచ్చింది.

Continues below advertisement

ఇప్పటి వరకు ఎప్పుడైనా వేేలం వేశారా? 

అప్పట్లో అధికారులు ఈ మెట్ల మార్గాన్ని 24 విభాగాలుగా విభజించారు. ఒక విభాగాన్ని టవర్ మొదటి అంతస్తులో ప్రదర్శన కోసం మూడో విభాగాలను ఫ్రాన్స్‌లో ప్రముఖ మ్యూజియంలకు గిఫ్ట్‌గా ఇచ్చారు. మిగిలిన 20 విభాగాలను 1983డిసెంబర్‌లో వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. ఇప్పుడు వేలం వేయబోతున్నది మొదటి విభాగంలోనిదే. 

గత రికార్డులు ఏం చెబుతున్నాయి. 

ఈ వేలానికి ముందు దీని ధరను సుమారు నలభై వేల నుంచి యాభై వేల యూరోలుగా అంటే దాదాపు 50 లక్షలుగా అంచా వేశారు. అయితే గత చరిత్రను పరిశీలిస్తే ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2016లో ఒక మెట్ల విభాగం ఏకంగా 5, 23, 800 యూరోలకు అంటే ఐదు కోట్లకుపైగా అమ్ముడైంది. 2020లో వేలం వేసిన మరో విభాగం సుమారు 2-7 కోట్లకుపైగా ధర పలికింది. 

ఈ మెట్ల విభాగాలు ఇప్పుడు కేవలం ప్రాన్స్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. కొన్ని జపాన్‌లోని యోషీ ఫౌండేషన్‌లో, మరికొన్ని న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ‌ లిబర్టీ సమీపంలోని, డిస్నీల్యాండ్‌లో కూడా నిపిస్తాయి. 

ఒక ఎగ్జిబిషన్ కోసం నిర్మించిన ఈ ఈఫిల్ టవర్ నేటికీ ప్రపంచ పర్యాటకులను అలరిస్తోంది. దీన్ని గుస్తావ్ ఈఫిల్ అనే వ్యక్తం రెండు సంవత్సరాల్లోనే నిర్మించారు. గాలి తీవ్రతను తట్టుకోవడానికి ప్రత్యేకమైన స్ట్రక్చర్ ప్రిన్సిపల్‌ ను ఉపయోగించారు. నిటారుగా చూస్తే టవర్ కాస్త వంగినట్టు ఉంటుంది. ఇది గాలి ఒత్తిడి తట్టుకోవడానికి ఇలా నిర్మించారు. అప్పట్లో ఇది ప్రపంచంలోనే ఎత్తైన కట్టడంగా ఉండేది. ఈ వింతైన ఆకారాన్ని చూసి చాలా మంది విమర్శలు చేశారు. కానీ కాలక్రమేణా ఈ నిర్మాణ మేధస్సు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది.