China DF-5B ICBM Bomb News: చైనా ప్రభుత్వ టీవీ ఛానల్ CCTV తమ దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ (ICBM) DF-5B గురించి కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఈ మిస్సైల్ చాలా శక్తివంతమైనది, ఇది అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చసి అణు దాడి చేయగలదు అని తెలిపింది. చైనా, పాశ్చాత్య దేశాల మధ్య, ముఖ్యంగా అమెరికాతో తైవాన్, దక్షిణ చైనా సముద్రం, సైనిక విస్తరణపై ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో చైనా మీడియా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యాత సంతరించుకుంది. 

ICBM DF-5B ప్రత్యేకతలు, పరిధిDF-5B అనేది రెండు దశల, సైలో-ఆధారిత క్షిపణి. ఇది 1970ల ప్రారంభంలో ప్రారంభించగా.. 1981 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది 32.6 మీటర్ల పొడవు, 3.35 మీటర్ల వ్యాసంతో  దాదాపు 183 టన్నుల బరువు ఉంటుంది.

ఈ క్షిపణి ఒక అణు యుద్ధ ట్యాంకును మోసుకెళ్లగలదు. దీని సామర్థ్యం 3 నుండి 4 మెగాటన్ల TNTకి సమానం. అంటే జపాన్ లోని హిరోషిమాపై ప్రయోగించిన అణు బాంబు కంటే దాదాపు 200 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఇది 12,000 కిలోమీటర్ల (7,460 మైళ్ళు) రేంజ్  కలిగి ఉంది. ఇది అమెరికాతో పాటు పశ్చిమ ఐరోపాపై దాడులకు చైనా వినియోగించే అవకావం ఉంది. 

చైనా అణు శక్తిలో భాగంఈ ఐసీబీఎం డీఎఫ్ 5బీ మిస్సైల్ గురించి సమాచారాన్ని బహిరంగపరచడం అనేది చైనా అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వ్యూహాత్మక ప్రయత్నమని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్షిపణి చైనా ఆర్మీ, అణు శక్తిలో ఒక ముఖ్యమైన భాగం అని భావిస్తున్నారు. మాజీ PLA (PLA) శిక్షకుడు సాంగ్ జోంగ్‌పింగ్ మాట్లాడుతూ.. DF-5బీ చైనా అణు సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పడంతో కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, “DF-5 లేకపోతే చైనాను బలమైన అణ్వస్త్ర దేశంగా పరిగణించరు” అని తెలిపారు.

DF-5B గురించి సమాచారాన్ని బహిరంగపరచడం అనేది కొత్త తరం ICBM మిసైల్స్‌ను ప్రయోగించడానికి సన్నాహాలలో భాగమని సాంగ్ జోంగ్‌పింగ్ అభిప్రాయపడ్డారు. ఇది చైనా సైనిక పారదర్శకతలో మార్పునకు సంకేతం అని భావిస్తున్నారు. దీని ద్వారా చైనా తన రక్షణ శక్తి అత్యంత పటిష్టంగా ఉందని, ఏదైనా సవాల్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని సందేశం ఇచ్చింది.

అణు శక్తిని పెంచడానికి చైనా ప్రయత్నాలుసెప్టెంబర్ 25, 2024న చైనా రక్షణ మంత్రిత్వ శాఖ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ (PLARF) ఒక ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ (ICBM)ను పరీక్షించినట్లు తెలిపింది. ఇది DF-31 కు లేటెస్ట్ ఆధునిక వెర్షన్ అని తెలిపారు.

పెంటగాన్ ప్రకారం, చైనా వద్ద 600 కంటే ఎక్కువ అణు ఆయుధాలు ఉన్నాయి మరియు 2030 నాటికి ఈ సంఖ్య 1000 దాటవచ్చు. అమెరికా రక్షణ విభాగం చైనా మూడు ప్రధాన ప్రదేశాలలో దాదాపు 320 మిసైల్ సైలోలను నిర్మించిందని అంచనా వేసింది.

చైనా 'నో-ఫస్ట్-యూజ్' విధానంభారతదేశంతో పాటు 'నో ఫస్ట్ యూజ్' విధానాన్ని అనుసరించే ఏకైక దేశం చైనా. అంటే, ఇది ఏ దేశంపై మొదట అణు దాడికి యత్నించదు. అణు సామర్థ్యం లేని దేశాలపై దీనిని ఉపయోగించదు.