Canadian PM Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పదవీ గండం పొంచి ఉంది. చేసిన నిర్వాకాలా చాలు ఇక తప్పుకోమంటూ కెనడా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ సమావేశంలో ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఎంపీలు రాజీనామాకు అల్టిమేటం జారీ చేశారు. 


భారత్‌తో సున్నం పెట్టుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అనుకోని కష్టం వచ్చి పడింది. ఆధారాలు లేని కేసులో లేని పోని ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దిగజార్చేందుకు యత్నించారు. కర్మ రిటర్న్స్‌ అన్నట్టు ఇప్పుడు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రమాదం వచ్చి పడింది. 


కెనడా ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రిజైన్ చేయాలని ఎంపీలు పట్టుబట్టారు. అక్టోబర్ 28లోగా రాజీనామా చేయాలని డెడ్‌లైన్ పెట్టారు. ఎప్పటి నుంచో వ్యతిరేకత ఉన్నప్పటికీ...ఈ మీటింగ్‌లో ఒక్కసారిగా తమ ఫ్రస్ట్రేషన్‌ చూపించారు. ఈ మేరకు ఓ డాక్యుమెంట్‌ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చారు. 


ట్రూడో రాజీనామా చేయకపోతే తరవాతి పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం అందులో ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ డాక్యుమెంట్‌పై లిబరల్ పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు సంతకం చేశారు. అంతే కాదు. అమెరికాలోని ఎలక్షన్స్‌కి ఇక్కడి పరిస్థితులకు లింక్ చేస్తూ డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు. 


ట్రూడో వద్దంటున్న ఎంపీలు


నాలుగు గోడల మధ్య అసమ్మతి లిబరల్ MPలు తమ మనసులో మాటలను ట్రూడోకు తెలియజేశారు. పార్టీలో పెరుగుతున్న అసంతృప్తికి ఇది ప్రతిబింబిస్తుంది. హౌస్ ఆఫ్ కామన్స్ సెషన్‌లో ఉన్న సమయంలో ఎంపీలు తమ ఫిర్యాదులు తెలియజేశారు. కనీసం 24 మంది ఎంపీలు లిబరల్ నాయకుడిగా ట్రూడోను వ్యతిరేకిస్తున్నారు.  
బుధవారం జరిగిన కాకస్ సమావేశంలో ఎంపీలు ప్రసంగించడానికి ఒక్కొక్కరికి రెండు నిమిషాల సమయం ఇచ్చారు. అంతా ముక్తకంఠంతో వచ్చే ఎన్నికలకు ముందే ట్రూడోను పక్కన పెట్టాలని కోరారు. దీన్ని వ్యతిరేకిస్తున్న ఎంపీలు కొందరు ప్రధానికి మద్దతుగా నిలిచారని తెలుస్తోంది. 


ట్రూడో భావోద్వేగం


ఈ సమావేశంలోనే మాట్లాడిన ట్రూడో కాస్త భావోద్వేగానికి గురైనట్టు తెలుస్తోంది. తన పిల్లలు చూసేలా బహిరంగంగా"F--- ట్రూడో" ప్లకార్డులు చూపించడాన్ని తప్పుపట్టారు. సమావేశంలో ఎంపీలు చెప్పిన సలహాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. ట్రూడోపై ఒత్తిడి ఉన్నప్పటికీ పదవి నుంచి వెళ్లాలా ఉండాలా అనేది పూర్తిగా ఆయన ఇష్టంపై ఆధార పడి ఉంటుంది. 


భారత్‌తో వైరం పెరిగినప్పటి నుంచి మారుతున్న పరిస్థితులు


జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోడానికి అంగీకరించకపోతే ఎలాగైతే డెమొక్రాట్ పార్టీలో అలజడి రేగిందో..అదే విధంగా లిబరల్ పార్టీలోనూ జరుగుతుందని హెచ్చరించారు. మీటింగ్ జరుగుతుండగానే ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నుంచి ట్రూడో తప్పుకోవాలంటూ అల్టిమేటం ఇచ్చారు. భారత్‌తో వైరం పెరిగినప్పటి నుంచి ఎంపీల్లో ప్రధాని ట్రూడోపై అసహనం పెరిగిపోయింది. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్  హత్యలో భారత్‌ జోక్యం ఉందని సంచలనం ఆరోపణలు చేశారు ట్రూడో. అప్పటి నుంచే స్థానికంగా వ్యతిరేకత పెరిగింది.


Also Read: ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టంలో ఐరన్ డ్రోమ్ ఒక్కటేనా? ఇంకా ఉన్నాయా?