ఆ దంపతులకు మూడేళ్ల క్రితం మ్యారేజ్ జరిగింది. కానీ ఇప్పటి వరకూ ఆ కార్యం జరగలేదు. భర్త అస్సలు అంగీకరించడం లేదు. అడిగితే వంద కారణాలు చెబుతున్నాడు. గట్టిగా అడిగితే.. వరకట్నం ఇడిగినంత ఇస్తేనే.. కలుస్తానని చెప్పాడు. అడిగినంత డబ్బు తెచ్చి ఇచ్చింది. అయినా అయిష్టంగానే ఉండటంతో భార్యకు అనుమానం వచ్చింది. ఎప్పుడు ఫోన్ తోనే ఉండేవాడు. ఆ విషయం గమనించిన భార్య... ఓ రోజు ఫోన్ లాక్కొని చూసింది. ఒక్కసారిగా షాక్ గురైంది. ప్రస్తుతం వారి మ్యారేజ్ లైఫ్ కోర్టు మెట్లపైకి వెళ్లింది. విడాకులు కచ్చితంగా కావాలని భార్య పోరాటం చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. 


కర్ణాటకలోని బెంగళూరులో 31 ఏళ్ల బ్యాంకు ఉద్యోగితో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి 2018 జూన్‌లో మ్యారేజ్ అయింది. అతడికి అది రెండో వివాహం. పెళ్లయినప్పటి నుంచి ఆమెతో పడక గదిలో గడపడం లేదు. ఎందుకు అని ఆమె ప్రశ్నించింది. మొదట్లో ఎక్కువ కట్నం తెస్తేనే అని చెప్పాడు. సరేనని.. ఆమె అడిగినంత డబ్బు తెచ్చి ఇచ్చింది. అయినా కూడా కార్యం జరగలేదు. ఆమె చాలాసార్లు అడిగింది. ప్రతీసారి ఏదో ఒక కారణం చెబుతాడు.. తప్పించుకుంటాడు. ఒకటి రెండు కాదు.. మూడేళ్లు ఇలానే జరిగింది  


ఫస్ట్ నైట్ కు ఒప్పుకోని భర్త.. ఎక్కువగా ఫోన్ లో బిజీగా ఉండేవాడు. ఆ భార్యకు అనుమానం వచ్చింది. వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడేమో అనుకుంది. ఓ రోజు ఫోన్ లాక్కొని.. చూసింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ భర్త పురుషులతో లైంగిక పరమైన విషయాలు చాట్ చేస్తున్నాడు. అంతేకాదు.. గే యాప్ లో ప్రొఫైల్ ఉంది. ఇది చూసి ఒక్కసారిగా ఆమె షాక్ కు గురైంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇందుకేనా కార్యానికి ఒప్పుకోనిది అనుకుంది. భర్తను గట్టిగా నిలదీసింది. ఇక అసలు విషయం తెలిసేసరికి భర్త నిజం ఒప్పుకున్నాడు.


తాను గే అని..  గే డేటింగ్‌ యాప్‌లలో ప్రొఫైల్‌ ఉందని అంగీకరించాడు. ఇక అతడితో విడిపోవడమే మంచిదని ఆమె నిర్ణయానికి వచ్చింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు సోమవారం కోర్టులో విచారణ జరిగింది. న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసింది. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో తేగ వైరల్ అయింది. మెుదటి భార్య కూడా అందుకనే విడిపోయినట్లు తెలుస్తోంది. ముందే చెప్తే.. అసలు పెళ్లి చేసుకునేదానిని కాదు.. కదా అంటూ రెండో భార్య మండిపడుతుంది. తన జీవితాన్ని భర్త కుటుంబ సభ్యులే నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.