WB By-Election Voting LIVE: ప్రశాంతంగా ముగిసిన ఉపఎన్నికల పోలింగ్.. అక్టోబర్ 3న ఫలితాలు
బంగాల్లో మూడు స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి దృష్టి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్ స్థానంపైనే ఉంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.
ABP Desam Last Updated: 30 Sep 2021 07:47 PM
Background
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా...More
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. తెల్లవారుజామునే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.జాంగీపుర్, సంసేర్గంజ్ అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఓటమిపాలైన దీదీ ఈ ఉపఎన్నికలో భవానీపుర్ నుంచి పోటీ చేస్తున్నారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ బరిలో ఉన్నారు. అక్టోబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒడిశాలోని పిపిలీ నియోజకవర్గంలో కూడా నేడు పోలింగ్ జరుగుతోంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..
బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.