WB By-Election Voting LIVE: ప్రశాంతంగా ముగిసిన ఉపఎన్నికల పోలింగ్.. అక్టోబర్ 3న ఫలితాలు

బంగాల్‌లో మూడు స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అందరి దృష్టి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్ స్థానంపైనే ఉంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.

ABP Desam Last Updated: 30 Sep 2021 07:47 PM

Background

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్​ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. తెల్లవారుజామునే పోలింగ్​ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా...More

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..

బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో ఉన్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 53.32 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్​ ప్రశాంతంగా ముగిసింది.