Breaking News Live: ఎల్లుండి నెల్లూరులో సీఎం జగన్ పర్యటన

AP Telangana Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 26 Mar 2022 10:13 PM
ఎల్లుండి నెల్లూరులో సీఎం జగన్ పర్యటన

ఈ నెల 28న (సోమవారం) నెల్లూరులో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 11.30 గంటలకు నెల్లూరు చేరుకోనున్న సీఎం. గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. 


 

హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం, 40 లక్షల ఆస్తి నష్టం 

హైదరాబాద్  పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మదీనా సమీపంలోని చెత్త బజార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బారా లైన్ గల్లిలోని చెప్పుల గోదాంలో మంటలు చెలరేగాయి. ఎస్ఎస్ ఫుట్ వేర్ చెప్పుల  గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఫుట్ వేర్ కాలిబూడిదైంది. దాదాపు 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. రంజాన్ మాసం సమీపిస్తుండడంతో ఇటీవలే ఫుట్ వేర్ లోడ్ తెప్పించారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపుచేశారు.  ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. 

శ్రీవారి ధర్మరథం బస్సులో చెలరేగిన మంటలు

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో శ్రీవారి ధర్మరథం బస్సులో మంటలు చెలరేగాయి. శ్రీవారి సేవకులతో తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు బయల్దేరింది. మొదటి మలుపు వద్ద బస్సులోని డీజల్ లీక్ అవడంతో బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితం బయటపడ్డారు.  బస్సులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.    

Tirumala Road Accident: తిరుమలలో టెంపో ట్రావెలర్, ఆర్టీసీ బస్సు ఢీ - 9 మందికి గాయాలు

Tirumala Road Accident:  తిరుపతి : తిరుమలలోని శ్రీవారి పాదాలు ఘాట్ రోడ్డులో పెనుప్రమాదం తప్పింది.. శ్రీవారి పాదాల వద్దకు వెళ్తున్న టెంపో ట్రావెలర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో టెంపో ట్రావెలర్ ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది.. టెంపో ట్రావెలర్ లో ప్రయాణం చేస్తున్న ఇద్దరు డ్రైవర్ తో సహా 9 మంది ప్రయాణికులకు గాయాలు కాగా.. క్షతగాత్రులను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.. ఎతైన ఘాట్ సెక్షన్ కావడం, అందులోనూ సింగల్ రోడ్డులో ప్రయాణం సాగించాల్సిన నేపథ్యంలో మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు గమయించక ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గంత రెండు నెలలుగా శ్రీవారి పాదాలకు మొదటి సారి ఆర్టీసీ బస్సులను కేటాయించారు. 

బీర్భూమ్ హింస కేసులో 21 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు: CBI

పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ హింస కేసులో సెక్షన్ 147, 148, 149 మరియు ఇతర సెక్షన్ల కింద 21 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది.





Road Accident In Kovvuru: కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం - లారీల మధ్యలో కారు నుజ్జు నుజ్జు

పశ్చిమ గోదావరి జిల్లా...  కొవ్వూరు గామన్ బ్రిడ్జిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనుక ఒకటిగా ఆరు లారీలు పరసస్పరం ఢీకొన్నాయి. లారీల మధ్యలో ఓ కారు నుజ్జు నుజ్జు అయింది. మరోవైపు ఒక వ్యాన్లో నుంచి పాస్పరస్ డైక్లోరైడ్ ద్రావణం లీక్ అవుతోంది. ద్రావణం నుండి ప్రమాదం పొంచి ఉండడంతో అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Students Supend: ప. గో జిల్లా ర్యాగింగ్ వివాదం - 9 మంది  విద్యార్థులు సస్పెండ్

Students Supend In West Godavari: ప. గో జిల్లా ర్యాగింగ్ వివాదం - 9 మంది  విద్యార్థులు సస్పెండ్
తాడేపల్లిగూడెం ఏపీ నిట్ లో జరిగిన ర్యాగింగ్ కు కారణమైన తొమ్మిది మంది విద్యార్థులు సస్పెండ్.
నలుగురు చివరి సంవత్సరం, అయిదుగురు తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను సస్పెండ్ చేసిన నిట్ డైరెక్టర్ CSP రావు

బ్యాటరీ వెహికల్ పేలి తండ్రి, కూతురు మృతి.. తమిళనాడులో విషాదం

బ్యాటరీ వెహికల్ పేలి తండ్రి, కూతురు మృతి..
బ్యాటరీ వెహికల్ పేలడంతో విషాదం చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో తండ్రి, కూతురు మృతిచెందారు. ఈ ప్రమాదం తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా చిన్నపూర్ బలరామ్ వీధిలో జరిగింది. బ్యాటరీ వాహనానికి ఛార్జింగ్ పెట్టి పడుకున్న తురై వర్మ. కానీ అర్ధరాత్రి ఒంటిగంటకు ఒక్కసారిగా బ్యాటరీ వాహనం పేలడంతో తండ్రి తురై వర్మ, మోహన్ ప్రీతిలు అక్కడిక్కడే మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Harish Rao In Srisailam: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ రావు

Harish Rao Visits Srisailam Temple: శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ ఆర్ధికమంత్రి హరీష్ రావు


శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు దంపతులు దర్శించుకున్నారు. శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి హరీష్ దంపతులకు ఆలయ ఈవో ఎస్.లవన్న అర్చకులు, ఆలయ మర్యాదలతో మంత్రి దంపతులకు స్వాగతం పలికారు అనంతరం మంత్రి హరీష్ రావు దంపతులు ధ్వజస్తంభం తాకి నమస్కరించి మల్లికార్జునస్వామిని భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి హరీష్ రావు దంపతులకు అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Vemula Prashanth Reddy Comments: నూకల బియ్యం తినిపించాలని ప్రజలను హేళన చేసిన కేంద్రం

Vemula Prashanth Reddy Pressmeet: హైదరాబాద్.. టీఆర్ఎస్ భవన్ లో మంత్రులు ప్రెస్ మీట్


మా వద్ద వడ్లు కొనే సామర్థ్యం లేదు. కేంద్రాన్ని కొనమంటే తెలంగాణా ప్రజలను అవమానించారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నూకల బియ్యం ప్రజలకు తినిపించమని హేళన చేశారని, కనుక తెలంగాణ ప్రజలకు కేంద్రం, బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేంద్రం ధాన్యం కొంటే మేము పూర్తిగా సహకరిస్తామని, మీరు కొంటానంటే మేము ముందే రైతులకు డబ్బులు చెల్లిస్తామని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు.

Telangana Governor TamiliSai: మన్ననూర్‌లో గవర్నర్ తమిళిసైకి ఘన స్వాగతం

Telangana Governor TamiliSai:  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నాగర్‌కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. నల్లమల పరిధిలోని చెంచుగూడెంలను ఆమె సందర్శించనున్నారు. మన్ననూరు చేరుకున్న గవర్నర్ తమిళిసైకి  అటవీ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు.

Background

AP Telangana Breaking News Live Updates: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. సాగర నగరం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ (South Coatal Railway Zone), వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ప్రత్యేక జోన్‌ ఏర్పాటుకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో పేర్కొన్న సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్‌ అధికారులతో గతంలో కమిటీ వేశారు. 


రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇలా బదులిచ్చారు. ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ (విశాఖ రైల్వే జోన్)కు డీపీఆర్‌ సమర్పించాక కొత్త రైల్వేజోన్‌, రాయగడ రైల్వే డివిజన్‌ ఏర్పాటుకు పరిధి, ఇతర అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఈ అంశాలను పరిశీలించడానికి సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్‌ లెవెల్‌ కమిటీని ఏర్పాటు చేశాం. కొత్త రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకోసం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించినట్లు’ వివరించారు. ప్రత్యేక రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. మొదటగా ఇక్కడ కార్యకలాపాలు మొదలుపెట్టి, క్రమంగా అవసరమయ్యే నూతన భవనాల్ని నిర్మించుకోవాలని డీపీఆర్‌లో సూచించారు. ఈ దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పడాలంటే రాయగడ డివిజన్‌ కూడా ఏర్పాటు కావాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో దానిపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 


హైదరాబాద్‌లో ఇంధన ధరలు వాహనదారులకు మళ్లీ షాకిచ్చాయి. గత మూడు నెలలుగానిలకడగా ఉన్న ఇంధన ధరలు ఇక్కడ గత మూడు రోజులుగా పెరుగుతూ జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. 0.91 పైసలు పెరగడంతో నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 26th March 2022) రూ.110.91 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.24 కు చేరింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధరలు పెరగడంతో భారత్‌లో ప్రభావం చూపుతోంది. ఢిల్లీ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 26th March 2022)పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.112719 కాగా, ఇక్కడ డీజిల్ పై 34 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.98.70 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు స్వల్పంగా పెరిగాయి. 18 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.68 అయింది. డీజిల్‌పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.97.69గా ఉంది. చిత్తూరులో పెట్రోల్‌ పై 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.113.24కి పతనమైంది. డీజిల్ పై 19 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.99.14 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గరిష్ట ధరలకు చేరుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర రూ.280 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,590 అయింది. వెండి ధర రూ.1000 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.73,800 కు ఎగబాకింది.


ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. నేడు రూ.280 మేర పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 26th March 2022)  10 గ్రాముల ధర రూ.52,590 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200కు పుంజుకుంది. రూ.1000 పెరగడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.73,800 అయింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.