UP Election 2022: ఎన్నికలకు ముందే యోగికి అఖిలేశ్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

ABP Desam   |  Murali Krishna  |  11 Jan 2022 07:46 PM (IST)

సమాజ్‌వాదీ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. తాజాగా ఆ పార్టీ అధికార ప్రతినిధి.. భాజపా కార్యాలయానికి ఓ గిఫ్ట్ పంపారు. ఎన్నికల తర్వాత దాన్ని ఉపయోగించాలని సలహా ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా?

UP Election 2022: ఎన్నికలకు ముందే యోగికి అఖిలేశ్ గిఫ్ట్.. ఏంటో తెలుసా?

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్ గిఫ్ట్

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. దీంతో సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఐపీ సింగ్ భాజపాకు ఓ గిఫ్ట్  పంపించారు. ఏం గిఫ్ట్ తెలుసా? తాళం కప్ప. అవును.. మార్చి 10న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భాజపా కార్యాలయానికి తాళం వేయడానికి ఈ లాక్‌ను పంపించారట. 

లఖ్‌నవూలోని హజ్రాత్ గంజ్, విధాన సభ 7 అనే చిరునామాకు ఈ తాళం కప్ప షిప్పింగ్ అయిన మెసేజ్‌ను ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

ఓం ప్రకాశ్ రాజ్‌భర్ జీ, జయంత్ చౌదరీ జీ, రాజ్‌మాతా కృష్ణ పలేట్ జీ, సంయజ్ చౌహాన్ జీ.. తాజాగా స్వామి ప్రసాద్ మౌర్యా జీ.. ఇలా అందరూ భాజపా నుంచి సమాజ్‌వాదీ పార్టీకి క్యూ కడుతున్నారు. అందుకే భాజపా కార్యాలయానికి తాళం కప్ప వేసేందుకు స్వతంత్ర దేవ్ సింగ్ జీకి ఇది బహుమతిగా పంపుతున్నాను. మార్చి 10 (యూపీ ఎన్నికల ఫలితాలు)న దీంతో కార్యాలయానికి తాళం వేసి.. ఇంటికి వెళ్లిపోండి. ఇది అల కాదు.. సమాజ్‌వాదీ పార్టీ తుపాను.                                                     -      ఐపీ సింగ్, సమజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి 

భాజపాకు షాక్..

ఎన్నికలకు ముందు భాజపాకు యూపీలో షాక్ తగిలింది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య తన కేబినెట్ పదవికి రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న వ్యాపారులను భాజపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ కారణంగానే నేను యోగి ఆదిత్యనాథ్ మంత్రి మండలికి రాజీనామా చేశాను.                                             "
- స్వామి ప్రసాద్ మౌర్య   
 
మరింత మంది..

తన రాజీనామా లేఖలో కూడా స్వామి ప్రసాద్ మౌర్య ఇదే కారణం చెప్పారు. అంతేకాంకుండా రానున్న రోజుల్లో మరింత మంది భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని జోస్యం చెప్పారు.

దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్​ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు  ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు

Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!

Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 11 Jan 2022 07:44 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.