Breaking News Telugu Live Updates: తెలంగాణ డీజీపీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 04 Jun 2022 02:59 PM
Telangana డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు 

Telangana డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు  
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఆందోళన.. యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


మోత రోహిత్ 
మీడియాలో వచ్చే వరకు పోలీసులు స్పందించకపోవడం హాస్యాస్పదం. నాలుగు రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ నిందితులను శిక్షించాలని హోం మంత్రిని ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. నిందితులను గుర్తించి శిక్షించడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం అందుకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, హోంమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ స్పందించి అసలైన దోషులను అదుపులోకి తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

Janasena Party Meeting: మంగళగిరిలో మధ్యాహ్నం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2గం.30ని.లకు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సమావేశంలో పాల్గొన్న కార్యవర్గం, సభ్యులను ఉద్దేశించి సాయంత్రం పవన్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగానికి హాజరు కావాలని మీడియాను ఆహ్వానించారు. 

Hyderabad జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మరోసారి ఉద్రిక్తత

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మరోసారి ఉద్రిక్తత


మైనర్ బాలిక కేసులో న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు, (జనసేన కార్యకర్తలు) నిరసన..


పోలీస్ స్టేషన్ ముట్టడించిన జనసేన


జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దమ్మ గుడి వరకు భారీగా ట్రాఫిక్ జాం


భారీగా పోలీసులు మోహరింపు


కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు

Jubilee Hills Minor girl case: బాలిక రేప్ కేసులో మరో ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బాలిక రేప్ కేసులో మరో ముగ్గురు నిందితుల అరెస్ట్..


తమిళనాడు, కర్నాటక లో ముగ్గురు నిందితుల అరెస్ట్..


ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..


రేప్ కేసులో పోలీసుల అదుపులో మొత్తం ఐదుగురు నిందితులు.. బాలిక రేప్ కేసులో కొనసాగుతున్న విచారణ..

Palnadu District: పల్నాడుజిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాల ఉద్రిక్తత

పల్నాడుజిల్లా నరసరావుపేట ఏరియా వైద్యశాల ఉద్రిక్తత.


తమకు సంబంధం లేకుండా టీడీపీ నేత కంచర్ల జల్లయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం చేశారంటూ ఆందోళన కు దిగిన కుటుంబ సభ్యులు.


తమ నేతలు వచ్చే వరకూ పోస్ట్ మార్టం చేయొద్దంటూ ఆందోళన కు దిగిన మృతుని కుటుంబ సభ్యులు.


పోలీసులతో వాగ్వాదానికి దిగిన మృతుని కుటుంబసభ్యులు.


మార్చురీ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగిన బంధువులు.


పోలీసులు, బంధువుల మధ్య తీవ్ర తోపులాట.


బంధువులను నెట్టివేసి పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని వైద్యశాల నుండి అంబులెన్స్ లో బొల్లాపల్లి మండలం రావులాపురం తరలించిన పోలీసులు.


మృతదేహాన్ని తరలించేందుకు అడ్డుపడ్డ బంధువులు.


బంధువులను తోసివేసి మృతదేహాన్ని తరలించిన పోలీసులు.


వైద్యశాలలో బైఠాయించి ఆందోళనకు దిగిన మృతుడు బంధువులు.

ఐదు రోజుల కిందట కిడ్నాపైన రాజశేఖర్ దారుణహత్య

కట్టంగూరు (మం)అయిటిపాముల గ్రామంలో దారుణం...


ఐదు రోజుల క్రితం రాజశేఖర్ (27)అనే యువకుడు కిడ్నాప్...


రామచంద్రగూడెం శివారులో హత్యకు గురైన రాజశేఖర్...


తోటిస్నేహితుడే హతమార్చినట్టు పోలీసుల అనుమానం....


పోలీసుల అదుపులో అనుమానితుడు.....


ఆర్థిక లావాదేవీల నేపధ్యంలో రాజశేఖర్ ను హతమార్చినట్టు సమాచారం...


హత్య అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిన నిందితుడు ? 


ఇంకా కుటుంబ సభ్యులకు చేరని మృతదేహం...


ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు

TDP Activist Murder: నేడు పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడుకు టీడీపీ బృందం

నేడు పల్నాడు జిల్లా జంగమేశ్వరపాడుకు టీడీపీ బృందం
కార్యకర్త జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్న టీడీపీ నేతలు
ప్రత్యర్థుల దాడిలో నిన్న మరణించిన టీడీపీ కార్యకర్త జల్లయ్య
నరసరావుపేటకు రాకుండా పోలీసులు తేలుకుంట్లలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని శ్రీనివాసరావు గృహనిర్బంథం

Background

నైరుతు రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ వారం ఏపీని రుతుపవనాలు తాకనున్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది.  పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను మరో రెండు రోజుల్లో తాకనున్నాయి. తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా.. మధ్యాహ్నానికి వేడిగా మారుతోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ 40, 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నిన్నటితో పోల్చితే నేడు బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.540 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.1500 మేర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,500 అయింది.


ఏపీలో పెరిగిన బంగారం ధర.. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో  విజయవాడలో 24 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర రూ.52,470 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 కు ఎగబాకింది. రూ.1,500 మేర పుంజుకోవడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.68,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో రూ.540 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.68,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


హైదరాబాద్‌లో ఇంధన ధరలు వరుసగా నాలుగోరోజు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 33 పైసలు పెరగడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.109.54 కాగా, 30 పైసలు పెరగడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.70 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో ఇంధన ధరలు దిగొచ్చాయి. 19 పైసలు తగ్గడంతో నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.85 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.99 అయింది. 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.