కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బాలికల గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 20 Aug 2022 01:25 PM

Background

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ రోడ్డులో ప్రజాదీవెన సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది టీఆర్‌ఎస్. తెలంగాణ రాజకీయాలకు, రాబోయే ఎన్నికలకు ఇదో కొలమానంగా పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ సభను టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే...More

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బాలికల గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని బాలికల గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం అనంతరం వాంతులు విరోచనాలు కావడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యం అందించిన డాక్టర్ ఫుడ్ పాయిజన్ గా నిర్ధారించారు. అయితే 30 మంది విద్యార్థులలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. రెండు రోజుల క్రితం ప్రాథమిక పాఠశాలలో  ఘటన మరవక ముందే గురుకుల పాఠశాలలో బాలికలకు ఫుడ్ పాయిజన్ పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.15  రోజుల క్రితం గురుకుల పాఠశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి మరవకముందే విద్యార్థులకు కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురవడం విద్యార్థులు తల్లిదండ్రులు గురుకుల పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.