Breaking News Telugu Live Updates: కేసీఆర్‌తో ముగిసిన ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 12 Jun 2022 09:14 PM

Background

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ ప్రస్తుతం తగ్గింది. శుక్రవారం, శనివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూకాంప్లెక్స్‌ వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరి వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 40 గంటల...More

CM Jagan News: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి – ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు బాలసాకేత్‌ రెడ్డి – మహిమల వివాహం ఇటీవల హైదరాబాద్‌ లోని ఫిలింనగర్ జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్‌ లో జరిగింది. ఈ వేడుకకు సీఎం జగన్ హాజరు కాలేదు. అక్కడ విజయమ్మ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలిలో బాలసాకేత్ రెడ్డి -మహిమ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఆత్మకూరు ఉప ఎన్నికల కోసం ఆల్రడీ మంత్రుల బృందం నెల్లూరులోనే మకాం వేసింది. వీరంతా రిసెప్షన్ కు హాజరయ్యారు. వేదికమీద నూతన దంపతులను సీఎం జగన్ ఆశీర్వదంచారు. కావలిలోని ఆర్ఎస్ఆర్ విద్యాసంస్థల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.