Breaking News: దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. హాజరైన కాంగ్రెస్ కీలక నేత భట్టి విక్రమార్క

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 13 Sep 2021 05:38 PM

Background

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి....More

దళిత బంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష.. హాజరైన భట్టి

దళితబంధు పథకం అమలుపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో ఓ సమీక్షా సమావేశం జరుగుతోంది. హుజూరాబాద్‌తో పాటు మరో 4 మండలాల్లో దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌  మండలాల్లో పైలట్‌ ప్రాజెక్టు అమలుపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు.