తెలంగాణలో ఆర్థికి స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయని ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. రోజు వారీ ఖర్చులకి కూడా డబ్బుల్లేవని వేర్వేరు మార్గాల్లో అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆర్థిక స్థితిపై శ్వేత పత్రం సభలో ప్రవేశ పెట్టిన ఆయన... గత ప్రభుత్వం చేసిన తప్పులు కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. 


42పేజీల శ్వేత పత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. దాన్ని సభ్యులకు అందజేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు 6 లక్షల 71 వేల 757 కోట్లుగా పేర్కొంది ప్రభుత్వం. 2014-15 నాటికి ఈ అప్పు 72 వేల 658 కోట్లుగా ఉండేదని వివరిచింది. పదేళ్ల కాలంలో ఈ అప్పు 24.05 శాతం పెరిగిదంని వివరించింది. 2023-24లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం రాష్ట్ర అప్పు 3 లక్షల 89వేల 673 కోట్లకు చేరనుందని అంచనా వేసిందని తెలిపింది. 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతం ఉందని ఇది దేశంలోనే అత్యల్పమని పేర్కొంది. ఇప్పుడు అది 27.8 శాతానికి పెరిగిందని తెలిపింది. బడ్జెట్ వ్యయానికి వాస్తవ వ్యయానికి చాలా తేడా ఉందని సుమారు 20 శాతం అంతరం ఉన్నట్టు వివరించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రుణ భారం 10 రెట్లు పెరిగినట్టు వివరించింది. 42 పేజీల నివేదికను ఇప్పుడే చదివి చర్చలో పాల్గొనాలంటే ఎవరికైనా కష్టమని సభ్యులు అభ్యంతరం చెప్పడంతో టీ బ్రేక్ ఇచ్చారు. దీంతో సభ వాయిదా పడింది.